Movie News

తెలుగు మార్కెట్ ని తక్కువంచనా వేశారా

షారుఖ్ ఖాన్ సినిమాలకు దక్షిణాది రాష్ట్రాల వరకు చూసుకుంటే అత్యధిక రెవిన్యూ ఇచ్చేది ఏపీ, తెలంగాణనే. అందులోనూ నైజాం చాలా కీలకమైంది. పఠాన్ ని ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. పాతికేళ్ల క్రితం డిడిఎల్, బాజీగర్, డర్ లాంటి బ్లాక్ బస్టర్స్ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇతని కొత్త మూవీ జవాన్ సెప్టెంబర్ 7 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల జూలై 7న చెన్నై వేదికగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. అత్యంత ఖరీదైన వేడుకగా దీన్ని ప్లాన్ చేసినట్టు కోలీవుడ్ టాక్.

నిజానికి ముంబైలో చేయాల్సిన ఇలాంటి సంబరాన్ని చెన్నైలో ప్లాన్ చేసుకోవడం వెనుక కారణం సింపుల్. దర్శకుడు ఆట్లీ, హీరోయిన్ నయనతార, విలన్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇలా మొత్తం ఆరవ గ్యాంగే సినిమాకు పని చేసింది. సో సహజంగానే సాంబార్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అసలు కథనే కమల్ హాసన్ ఖైదీ వేట నుంచి స్ఫూర్తి చెంది రాసుకున్నారనే టాక్ ముందు నుంచి ఉంది. అది నిజమో కాదో కానీ షారుఖ్ సైతం ఈసారి సౌత్ బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట

అయితే తెలుగు మార్కెట్ ని మాత్రం జవాన్ టీమ్ తేలికగా తీసుకుందేమోననే అనుమానామాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆట్లీ ఎలాంటి పేరున్న టాలీవుడ్ ఆర్టిస్టులను తీసుకోలేదు. ప్రశాంత్ నీల్ నయం. కెజిఎఫ్ 2 కోసం రావు రమేష్ లాంటి వాళ్ళను పెట్టి లోకల్ టచ్ పెంచాడు. కానీ జవాన్ విషయంలో అట్లీ అలాంటి జాగ్రత్తలేమీ పాటించలేదు. బాలీవుడ్ మూవీనే అయినా వీలైనంత తమిళ టీమ్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంత భారీ స్థాయిలో షారుఖ్ చేయబోయే మొదటి సౌత్ ఈవెంట్ ఇదే.  తర్వాత హైదరాబాద్లో ఏదైనా ప్లాన్ చేస్తారా అంటే యూనిట్ నుంచి ఉండకపోవచ్చనే సమాధానమే వస్తోంది 

This post was last modified on June 28, 2023 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

39 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago