Movie News

ట్రైలర్ : రంగబలి సెంటర్లో కుర్రాడి సందడి

చాలా గ్యాప్ తర్వాత ఫన్ అండ్ యాక్షన్ జోన్ లోకి వచ్చిన నాగశౌర్య జూలై 7న రంగబలితో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గత కొనేళ్లుగా ఎన్ని విభిన్న ప్రయోగాలు చేస్తున్నా తన స్థాయికి తగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ కుర్ర హీరోకి దీని సక్సెస్ చాలా కీలకం. ఆ మధ్య వదలిన టీజర్ కి మంచి స్పందనే వచ్చింది. రిలీజ్ రోజు మీడియం రేంజ్ సినిమాలతో పోటీ గట్టిగానే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందాక అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. మూవీ కాన్సెప్ట్ ఏంటో వీడియోలో చెప్పేశారు.

స్వంత ఊరంటే విపరీతమైన అభిమానం ఉండే ఒక యువకుడు(నాగ శౌర్య) ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. డబ్బులు కావాలన్నా స్వంత తండ్రి(గోపరాజు రమణ) షాపులో దొంగతనం చేసేంత ఘటికుడన్న మాట. ఓ మెడికో స్టూడెంట్(యుక్తి తరేజా) ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడే క్రమంలో రంగబలి సెంటర్ గురించి తెలుస్తుంది. ఆ ప్రాంతంతో పాటు అందరినీ చెప్పు చేతల్లో పెట్టుకున్న ఓ రౌడీ నాయకుడి(షైన్ టామ్ చాకో) దోస్తీతో పాటు శత్రుత్వమూ వస్తుంది. ఇంతకీ రంగబలి వెనుక ఉన్న అసలు కథేంటో ఇంకో వారం ఆగితే తెలుస్తుంది

కంటెంట్ అయితే క్లాసు మాస్ అందరినీ టార్గెట్ చేసినట్టు ఉంది. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా టచ్ చేశారు. ప్రత్యేక పాత్ర వేసిన శరత్ కుమార్ ని కేవలం ఒక ఫ్రేమ్ లోనే చూపించి కట్ చేయడం, పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ హింట్ ఇవ్వడం బాగున్నాయి. కమెడియన్ సత్య టైమింగ్ తో నాగ శౌర్య పండించిన కామెడీ పేలేలా ఉంది. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన రంగబలిలో అన్ని అంశాలైతే పొందుపరిచారు. పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో ఛలోని మించిన కమర్షియల్ కంటెంట్ అయితే కనిపిస్తోంది. అంచనాలు అందుకుంటే హిట్టే

This post was last modified on June 27, 2023 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago