చనిపోయాక కూడా దశాబ్దాల తరబడి జనం హృదయాల్లో బ్రతికుండే అదృష్టం ఒక్క సినిమా వాళ్ళకే దక్కుతుంది. నిత్యం టీవీల్లో థియేటర్లలో ఏదో ఒక ఒక రూపంలో ఆయా నటీనటుల జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో అన్నీ రిలీజైనవే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం దురదృష్టశాత్తు రకరకాల కారణాల వల్ల ల్యాబ్ లో మగ్గిపోయి ఎప్పుడో మోక్షం దక్కించుకుంటాయి. ఆ మధ్య అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతిబింబాలు నలభై సంవత్సరాల తర్వాత వెలుగు చూస్తే కన్నడ దర్శకుడు తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చివరి చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అభిమానులకూ అలాంటి కానుక ఒకటి రాబోతోంది. ఈయన లాస్ట్ మూవీ అప్నో సే బెవఫాయి ఎల్లుండి 29న రిలీజ్ కాబోతోంది. ఏళ్ళ తరబడి దీనికి మోక్షం దక్కలేదు. ఇర్ఫాన్ చనిపోయింది 2020లో. అప్పటి నుంచి దీన్ని ఎన్నిసార్లు బయటికి తీసుకురావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. నటుడవ్వాలనే కోరికతో ముంబైకి వచ్చిన వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడం కోసం వ్యాపారాలు మొదలుపెడతాడు. అయితే ఈ క్రమంలో తన కుటుంబంతో పాటు చాలా వాటిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఈజీ మనీ తెచ్చే ప్రమాదాలను ఇందులో చూపించారు
ప్రకాష్ బలేకర్ దర్శకత్వం వహించిన ఈ అప్నోసే బేవఫాయిలో భారీ తారాగణం లేదు కానీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్లు బలంగా ఉంటాయట. మహేష్ బాబు సైనికుడుతో ఇర్ఫాన్ ఖాన్ మనకూ పరిచయమే. అది డిజాస్టర్ కావడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు. హిందీ చిత్రాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఇర్ఫాన్ ఎంత టాలెంటెడ్ నటుడో అర్థమవుతుంది. ముఖ్యంగా హిందీ మీడియం, తల్వార్, లైఫ్ అఫ్ ఫ్రై లాంటివి చాలా పేరు తీసుకొచ్చాయి. హాలీవుడ్ మూవీ ఇన్ఫెర్నోలో అవకాశం వెతక్కుంటూ వచ్చింది. మరి బాక్సాఫీస్ పై ఇర్ఫాన్ చివరి సంతకం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి
This post was last modified on June 27, 2023 12:30 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…