Movie News

తారక్ అభిమానికి న్యాయం కోసం ముక్తకంఠం

ఒక స్టార్ హీరో అభిమాని మరణిస్తే ట్రెండింగ్ టాపిక్ కావడం అరుదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్ నిన్న అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా అతని మృతదేహం మీదున్న గాయాలు, ఉరి వేసుకున్న చోట్ల కాళ్ళు నేలకు తాకడం లాంటివి ఉదహరిస్తూ దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ పూర్తి స్థాయిల విచారణ చేయాలనీ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది మెల్లగా అందరూ హీరోల ఫాలోయర్స్ మద్దతుని కూడబెట్టుకుంటోంది ట్విట్టర్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే శ్యామ్ ది తూర్పుగోదావరి జిల్లా చింతలూరు. జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం. విశ్వక్ సేన్ దాస్ కి ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేవుడిలా భావించే హీరో అతిధిగా రావడంతో ఆనందం తట్టుకోలేక ఏకంగా స్టేజిపైకి వెళ్ళాడు. పక్కనున్న వాళ్ళు తోసేయబోతున్నా తారక్ నిలువరించి మరీ ఫోటో దిగాడు. ఇది వైరల్ అయ్యింది. ట్విట్టర్ వేదికగా శ్యామ్ సినిమాల రికార్డులు, కలెక్షన్లు, సెంటర్లు, సామజిక కార్యక్రమాలు అన్నింటిలో చురుకుగా సమాచారం ఇచ్చేవాడని స్నేహితులు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఇలా చనిపోవడమే జీరించుకోలేకపోతున్నారు  

శ్యామ్ కు న్యాయం జరగాలని ఇతర హీరోల అభిమాన సంఘాలతో పాటు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, నిఖిల్, నిర్మాత ఎస్కెఎన్, టాలీవుడ్ పిఆర్ఓలు ముక్త కంఠంతో వీ స్టాండ్ విత్ శ్యామ్ అంటూ విచారణ  కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు ప్రాధమిక దశలోనే ఉందని సమాచారం. అయినా చదువు, వృత్తి పరంగా ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేని శ్యామ్ వెనుక ఏదో కుట్ర జరిగిదంటున్న ఫ్యాన్స్ అంటున్న మాటల్లో నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి 

This post was last modified on June 27, 2023 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago