మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. అందుకు మొదటి కారణం ఇది రీమేక్ కావడం. అందులోనూ ఎనిమిదేళ్ల కిందటి ఒక రొటీన్ మాస్ మూవీ ఆధారంగా ఈ సినిమా తీయడంతో అభిమానులకు ముందే సగం ఆశలు చచ్చిపోయాయి. దీనికి తోడు శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు ఇచ్చి.. పదేళ్ల పాటు సినిమాలే తీయని మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో మిగతా ఆశలు కూడా చచ్చిపోయాయి.
ఐతే మెహర్ చిరుకు దూరపు బంధువు కావడం.. పైగా కరోనా టైంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడంతో అతనికేదో సాయం చేసే ఉద్దేశంతో చిరు ఈ ప్రాజెక్టును తనకు అప్పగించినట్లుగా మెగా వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో అభిమానులు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ సినిమా చూసేందుకు రెడీ అయ్యారు. ఐతే తక్కువ అంచనాలు పెట్టుకున్నా సరే.. టీజర్ చూశాక మెగా అభిమానులకే రుచించలేదు.
ఈ రోజుల్లో ఏ స్టార్ హీరో కూడా చేయనంత పరమ రొటీన్ సినిమాను చిరు చేశాడని టీజర్ చూస్తే అర్థమైంది. ఒరిజినల్ కంటే ముతకగా సినిమా ఉండబోతోందనే సంకేతాలను టీజర్ ఇచ్చింది. దీనికి తోడు చిరుకు తెలంగాణ యాస కుదరకపోవడం.. ఆయన డైలాగ్ డెలివరీ కూడా తేడా కొట్టడంతో సినిమా మీద నెగెటివిటీని పెంచేస్తోంది.
సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూస్తే సగటు ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు సైతం ఈ సినిమా మీద ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రోల్ మెటీరియల్లా మారుతుందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీజర్ సంగతి ఇలా ఉంటే ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది. అది అయినా కొంచెం మెరుగ్గా ఉండి.. ఇంటెన్సిటీ కనిపించకపోతే.. ఏదో ఒక సర్ప్రైజ్ అందులో లేకుంటే మాత్రం సినిమా రిజల్ట్ మీద ముందే ఒక అంచనాకు వచ్చేయొచ్చు. చిరుకు మళ్లీ ‘ఆచార్య’ తరహా చేదు అనుభవం తప్పకపోవచ్చు.
This post was last modified on June 27, 2023 9:50 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…