ఆదిపురుష్ మీద సెహ్వాగ్ పంచు

మన దేశంలో సినిమాలకు క్రికెట్ కున్నంత క్రేజ్ దేనికీ లేదు. వేర్వేరు రంగాలే అయినప్పటికీ రెండింటి మీద విపరీతమైన అభిమానం కలిగిన జనం కోట్లలో ఉన్నారు. అందుకే వీటికి ముడిపడిన ఏ అంశమైనా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ మీద ఎంత నెగటివ్ క్యాంపైన్ నడిచిందో కళ్లారా చూశాం. దెబ్బకు హీరోతో సహా ఎవరైనా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడితే ఒట్టు. దర్శకుడు రచయిత తప్ప రిలీజ్ తర్వాత కెమెరా ముందు కనిపించిన మొహాలే లేవు. వసూళ్ల పరంగా బాగా నెమ్మదించిన ఆదిపురుష్ కి  ఇవాళ వీకెండ్ కీలకం కానుంది.

ఇదిలా ఉండగా ఈ విజువల్ గ్రాండియర్ ని ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చూశాడు. మాములుగా ట్విట్టర్ లో పంచులతో అదరగొడుతూ నవ్వించే ఈ ఎటాకింగ్ బ్యాట్స్ మ్యాన్ ఆదిపురుష్ ని కూడా వదల్లేదు. షో అయ్యాక ట్వీట్ చేస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు తెలిసిందని కౌంటర్ వేశాడు. ఇది అర్థమైనవాళ్లకు నవ్వాగడం లేదు. అంటే భవిష్యత్తులో ప్రభాస్ ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ముందే గుర్తించిన సత్యరాజ్ అతన్ని కాపాడటం కోసమే కత్తితో పొడిచాడని సెహ్వాగ్ నిర్వచనం. పెట్టడం ఆలస్యం ఇతని పంచు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది

విచిత్రంగా ట్రోలింగ్ బ్యాచులతో  సెహ్వాగ్ గొంతు కలపడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొదటి మూడు రోజులు మూడు వందల కోట్లు గ్రాస్ సాధించినా బ్రేక్ ఈవెన్ కి ఇంకా చాలా దూరంలో ఆగిపోయిన ఆదిపురుష్ ఫైనల్ గా ఫ్లాప్ నుంచి తప్పుకోవడం అసాధ్యమే. మొన్న చెప్పుకోదగ్గ రిలీజులేవి లేకపోవడంతో ఓ మాదిరిగా నెట్టుకొస్తున్నప్పటికీ అది భారీ నష్టాలను పూడ్చేందుకు చాలడం లేదు. పైగా కేరళ, తమిళనాడులో డిజాస్టర్ కావడం మరింత దెబ్బ కొట్టింది. నార్త్ ఆడియన్స్ కన్నా మన ప్రేక్షకులే నయం. పది రోజులకు తర్వాత కూడా ఓ పర్వాలేదనిపంచే బుకింగ్స్ ఇక్కడే ఉన్నాయి