మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అతి తక్కువ అంచనాలున్న సినిమా అంటే.. భోళాశంకర్ అనే చెప్పాలి. అసలే వేదాళం లాంటి రొటీన్ మాస్ మూవీకి ఇది రీమేక్. పైగా పేలవమైన ట్రాక్ రికార్డున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలేవీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. లేటెస్ట్గా వచ్చిన టీజర్ కూడా అభిమానులు అంతగా కిక్ ఇవ్వలేదు. టీజర్కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇలాంటి సినిమా చిరంజీవి కెరీర్లోనే నంబర్ వన్ అవుతుందని స్టేట్మెంట్ ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి. భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర ఆ సాహసమే చేశారు. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ అనిల్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.
టీజర్ ఎలా ఉందని అడుగుతూ.. సినిమా ఇంతకుమించి ఉంటుందని.. చిరంజీవి కెరీర్లోనే భోళా శంకర్ నంబర్ వన్ సినిమా అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెబుతూ.. టీజర్లోని దేఖ్లేంగే డైలాగ్ కూడా వేశారు అనిల్ సుంకర.
కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. ఇది మరీ విడ్డూరమైన స్టేట్మెంట్లా ఉందని అంటున్నారు. మరోవైపు టీజర్ రిలీజ్కు అభిమానుల స్పందన చూసి మెహర్ రమేష్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. చిరు సినిమాను డైరెక్ట్ చేసిన ఎగ్జైట్మెంట్ మెహర్లో ఉండొచ్చు కానీ.. భోళా శంకర్ టీజర్ అయితే అంత గొప్పగా లేదన్న మాట వాస్తవం. అందుకే మెహర్ను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక టీజర్లో చిరు డైలాగ్ డెలివరీ, తెలంగాణ స్లాంగ్ విషయంలో కూడా అభిమానుల నుంచే మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఆగస్టు 11న రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…