తెలుగు రిలీజ్ వాయిదా వేశారు కానీ ఫహద్ ఫాసిల్ కొత్త సినిమా ధూమం మీద మూవీ లవర్స్ కి మంచి ఆసక్తే నెలకొంది. కేవలం కర్ణాటక, కేరళ వర్షన్లు మాత్రమే థియేటర్లకు వచ్చాయి. లూసియా, యుటర్న్ లాంటి వెరైటీ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కుమార్ దర్శకత్వంతో కెజిఎఫ్-కాంతార బ్యానర్ హోంబాలే ఫిలింస్ దీన్ని నిర్మించింది. బహుభాషల్లో డబ్బింగ్ చేసినప్పటికీ ప్రమోషన్లకు తగినంత టైం లేకపోవడంతో ఫైనల్ గా మన దగ్గరకైతే రాలేదు. హైదరాబాద్ లో మలయాళంలోనే చూసేందుకు ప్రేక్షకులు రెడీ కావడంతో తగినన్ని షోలే ఇచ్చారు.
ఇదో డిఫరెంట్ థ్రిల్లర్. సిగరెట్ కంపెనీలో పని చేసే అవినాష్(ఫహద్ ఫాసిల్)కు భారీ జీతంతో పాటు చక్కని జీవితం పొందుతున్నప్పటికీ దాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. చిన్నపిల్లలు సైతం పొగబారిన పడుతుంటే తన సంస్థ వాళ్ళను సైతం కస్టమర్లుగా ట్రీట్ చేస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఇక్కడే అవినాష్ అతని భార్య దియా(అపర్ణ బాలమురళి)ప్రమాదంలో పడతారు. టైం బాంబుకు బలి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సిగరెట్లు తాగుతూ తక్కువ టైంలో కోటి రూపాయలు పోగు చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండం నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ
తీసుకున్న పాయింట్ వైవిధ్యంగా అనిపించినా దర్శకుడు పవన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలవ్వడంతో కథనం మరీ నీరసంగా సాగుతుంది. థ్రిల్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ అవసరం లేని డ్రామాని జొప్పించడంతో కృత్రిమత్వం పెరిగిపోయి అంతకంతా ల్యాగ్ పెరిగిపోయింది. ఫహద్, రోషన్ మాత్యు, వినీత్ లు నటన పరంగా ఎలాంటి లోటు రానివ్వకపోయినా జీవం లేని సన్నివేశాలు వాళ్ళనూ నిస్సహాయులుగా మార్చాయి. ట్రైలర్, పవన్ గత చిత్రాలను బట్టి ధూమంని మరీ ఎక్కువ ఊహించుకుంటే అంతే స్థాయిలో నిరాశ కలుగుతుంది తప్ప అంచనాలకు తగ్గటయితే లేదు.
టాలీవుడ్లో తాను ఎదుగుతూ తన కోసం పని చేసే వాళ్లందరినీ మంచి స్తాయికి తీసుకొచ్చిన కథానాయకుల్లో అల్లు అర్జున్ ముందు…
తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా…
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మహా మహా బ్యాటర్లను వెనక్కి నెట్టి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా…
తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా…