తెలుగు రిలీజ్ వాయిదా వేశారు కానీ ఫహద్ ఫాసిల్ కొత్త సినిమా ధూమం మీద మూవీ లవర్స్ కి మంచి ఆసక్తే నెలకొంది. కేవలం కర్ణాటక, కేరళ వర్షన్లు మాత్రమే థియేటర్లకు వచ్చాయి. లూసియా, యుటర్న్ లాంటి వెరైటీ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కుమార్ దర్శకత్వంతో కెజిఎఫ్-కాంతార బ్యానర్ హోంబాలే ఫిలింస్ దీన్ని నిర్మించింది. బహుభాషల్లో డబ్బింగ్ చేసినప్పటికీ ప్రమోషన్లకు తగినంత టైం లేకపోవడంతో ఫైనల్ గా మన దగ్గరకైతే రాలేదు. హైదరాబాద్ లో మలయాళంలోనే చూసేందుకు ప్రేక్షకులు రెడీ కావడంతో తగినన్ని షోలే ఇచ్చారు.
ఇదో డిఫరెంట్ థ్రిల్లర్. సిగరెట్ కంపెనీలో పని చేసే అవినాష్(ఫహద్ ఫాసిల్)కు భారీ జీతంతో పాటు చక్కని జీవితం పొందుతున్నప్పటికీ దాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. చిన్నపిల్లలు సైతం పొగబారిన పడుతుంటే తన సంస్థ వాళ్ళను సైతం కస్టమర్లుగా ట్రీట్ చేస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఇక్కడే అవినాష్ అతని భార్య దియా(అపర్ణ బాలమురళి)ప్రమాదంలో పడతారు. టైం బాంబుకు బలి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సిగరెట్లు తాగుతూ తక్కువ టైంలో కోటి రూపాయలు పోగు చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండం నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ
తీసుకున్న పాయింట్ వైవిధ్యంగా అనిపించినా దర్శకుడు పవన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలవ్వడంతో కథనం మరీ నీరసంగా సాగుతుంది. థ్రిల్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ అవసరం లేని డ్రామాని జొప్పించడంతో కృత్రిమత్వం పెరిగిపోయి అంతకంతా ల్యాగ్ పెరిగిపోయింది. ఫహద్, రోషన్ మాత్యు, వినీత్ లు నటన పరంగా ఎలాంటి లోటు రానివ్వకపోయినా జీవం లేని సన్నివేశాలు వాళ్ళనూ నిస్సహాయులుగా మార్చాయి. ట్రైలర్, పవన్ గత చిత్రాలను బట్టి ధూమంని మరీ ఎక్కువ ఊహించుకుంటే అంతే స్థాయిలో నిరాశ కలుగుతుంది తప్ప అంచనాలకు తగ్గటయితే లేదు.
This post was last modified on June 25, 2023 12:12 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…