ఎంత అయిపోయిందనుకుంటున్నా ఆదిపురుష్ తాలూకు ముచ్చట్లు ఏదో ఒక రూపంలో చర్చలోకి వస్తూనే ఉన్నాయి. మొదటి మూడు రోజుల భారీ వసూళ్ల తర్వాత హఠాత్తుగా డెడ్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన ఈ రామాయణ గాథ మీద వివాదాలు కాస్త చల్లబడ్డాయి కానీ కలెక్షన్లు మాత్రం వారాంతంలో కూడా భారీగా నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా అందరి విమర్శలకు ప్రధాన టార్గెట్ గా మారిన రావణాసురుడి పాత్ర చిత్రణ, సైఫ్ అలీఖాన్ పోషించిన తీరు పట్ల ఎంత నెగటివిటీ వచ్చిందో చూశాం. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కనెక్షన్ ని ఫ్యాన్స్ తవ్వకాల్లో బయటికి తీశారు
2017లో రిలీజైన జై లవకుశ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తారక్ అన్న మాటలు ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ క్యారెక్టర్ ని పోషించేందుకు ఆనంద్ నీలకంఠ రాసిన అసుర పుస్తకం చదివాడట. అందులో 18 లోకాలకు రాజుగా ఉండటంతో అసుర చక్రవర్తిగా పేరుగాంచిన రావణబ్రహ్మకున్న విశిష్ట లక్షణాలు అందులో తెలుసుకున్నాడట. ఈ లక్షణం వల్లే యుద్దానికి ముందు రాముడు సైతం రావణుడు ఇంత గొప్పవాడు ఇలా అయ్యాడేననే రీతిలో పద్యం పాడినట్టు అందులో వివరించారట.
ఒక కమర్షియల్ మూవీకే జూనియర్ ఇంత హోమ్ వర్క్ చేసినప్పుడు మరి ఆదిపురుష్ లాంటి ఎపిక్ గ్రాండియర్ కోసం ఓం రౌత్ ఇంకెంత చేసుండాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్. అసలు రామాయణం పుస్తకమైనా చదవకుండా కేవలం తనకున్న జ్ఞానంతోనే ఆదిపురుష్ ని తీసి చెడగొట్టాడని వాళ్ళ కంప్లయింట్. ఏది ఎలా ఉన్నా ఇదంతా జరిగిపోయింది. ఎవరూ మార్చలేరు. కాకపోతే ఇలాంటివి తీసేటప్పుడు ఎంత హోమ్ వర్క్ అవసరమో గుర్తించాల్సిన అవసరమైతే చాలా ఉంది. జైలవకుశ కోసం తారక్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ కావడం కన్నా ఉదాహరణ ఇంకేం కావాలి
This post was last modified on June 24, 2023 5:00 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…