ఎంత అయిపోయిందనుకుంటున్నా ఆదిపురుష్ తాలూకు ముచ్చట్లు ఏదో ఒక రూపంలో చర్చలోకి వస్తూనే ఉన్నాయి. మొదటి మూడు రోజుల భారీ వసూళ్ల తర్వాత హఠాత్తుగా డెడ్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన ఈ రామాయణ గాథ మీద వివాదాలు కాస్త చల్లబడ్డాయి కానీ కలెక్షన్లు మాత్రం వారాంతంలో కూడా భారీగా నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా అందరి విమర్శలకు ప్రధాన టార్గెట్ గా మారిన రావణాసురుడి పాత్ర చిత్రణ, సైఫ్ అలీఖాన్ పోషించిన తీరు పట్ల ఎంత నెగటివిటీ వచ్చిందో చూశాం. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కనెక్షన్ ని ఫ్యాన్స్ తవ్వకాల్లో బయటికి తీశారు
2017లో రిలీజైన జై లవకుశ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తారక్ అన్న మాటలు ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ క్యారెక్టర్ ని పోషించేందుకు ఆనంద్ నీలకంఠ రాసిన అసుర పుస్తకం చదివాడట. అందులో 18 లోకాలకు రాజుగా ఉండటంతో అసుర చక్రవర్తిగా పేరుగాంచిన రావణబ్రహ్మకున్న విశిష్ట లక్షణాలు అందులో తెలుసుకున్నాడట. ఈ లక్షణం వల్లే యుద్దానికి ముందు రాముడు సైతం రావణుడు ఇంత గొప్పవాడు ఇలా అయ్యాడేననే రీతిలో పద్యం పాడినట్టు అందులో వివరించారట.
ఒక కమర్షియల్ మూవీకే జూనియర్ ఇంత హోమ్ వర్క్ చేసినప్పుడు మరి ఆదిపురుష్ లాంటి ఎపిక్ గ్రాండియర్ కోసం ఓం రౌత్ ఇంకెంత చేసుండాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్. అసలు రామాయణం పుస్తకమైనా చదవకుండా కేవలం తనకున్న జ్ఞానంతోనే ఆదిపురుష్ ని తీసి చెడగొట్టాడని వాళ్ళ కంప్లయింట్. ఏది ఎలా ఉన్నా ఇదంతా జరిగిపోయింది. ఎవరూ మార్చలేరు. కాకపోతే ఇలాంటివి తీసేటప్పుడు ఎంత హోమ్ వర్క్ అవసరమో గుర్తించాల్సిన అవసరమైతే చాలా ఉంది. జైలవకుశ కోసం తారక్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ కావడం కన్నా ఉదాహరణ ఇంకేం కావాలి
This post was last modified on June 24, 2023 5:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…