ఈ వారం బాక్సాఫీస్ చిన్న సినిమాల తాకిడితో వ్యాపారం లేని రైతు బజార్ ని తలపించింది. వాటిలో 1920 హారర్స్ అఫ్ ది హార్ట్స్ ఒకటి. బాలీవుడ్ మూవీ అయినా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. మహేష్ భట్ బృందం సృష్టించిన రాజ్ సిరీస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీరియస్ దెయ్యాల కథలతో కొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత వీళ్లది. 1920 టైటిల్ తో ఇప్పటి దాకా నాలుగు తీస్తే అవన్నీ కమర్షియల్ గా బాగానే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడిది ఐదోది. ఉయ్యాలా జంపాల ఫేమ్ అవికా గోర్ ప్రధాన పాత్ర కావడంతో మన ఆడియన్స్ లోనూ కొంత ఆసక్తి లేకపోలేదు
తండ్రి చావుకు తల్లి రాధిక(బర్కా బిస్ట్) కారణమని గుర్తించిన మేఘన(అవికా గోర్)దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతుంది. ప్రియుడు అర్జున్ (ధనిష్ పండోర్)కు దూరమయ్యే పరిస్థితి వచ్చినా వెనక్కు తగ్గదు. రాధిక అప్పటికే శంతను(రాహుల్ దేవ్)ని రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకుంటుంది. దీంతో రివెంజ్ కోసం నాన్న ఆత్మను సాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు అసలు స్టోరీ. మాములుగా దెయ్యం సినిమా చూడాలంటే భయం ఉండకూడదు. కానీ ఈ 1920ని థియేటర్ లో చివరి దాకా తట్టుకోవాలంటే బోలెడంత గుండె నిబ్బరం కావాలి.
హారర్ కంటే ఎక్కువ దర్శకుడు కృష్ణ భట్ తన టేకింగ్ తో వణికించాడు, కాదు విసిగించాడు. చీప్ గ్రాఫిక్స్ తో పాటు జుగుప్స కలిగించే విజువల్స్ నింపేసి ఠారెత్తించాడు. అవికా గోర్ ఎలాంటి మొహమాటాలు లేకుండా పడక గది సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు పండించేసింది. ట్విస్టులు సులభంగా ఊహించేలా పెట్టడమే కాకుండా హారర్ ఎపిసోడ్లను కనీసం జర్క్ ఇచ్చేలా డిజైన్ చేసుకోలేదు. కళ్ళు మూసుకోవాలనిపించే వికృత దృశ్యాలకు మాత్రం కొదవ లేదు. ఎప్పుడో డ్రై అయిపోయిన 1920 థీమ్ ని పట్టుకుని ఇంకా వేలాడుతున్న భట్ టీమ్ కి దండం పెట్టడం తప్ప ఆశించడానికి ఏమీ లేనంత గొప్పగా తీర్చిదిద్దారు.
This post was last modified on June 24, 2023 2:53 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…