రేణుదేశాయ్ మొన్నామధ్య హైద్రాబాద్కి షిఫ్ట్ అయిపోయినట్టు వార్తలొచ్చాయి. పిల్లలకు అందుబాటులో వుండడం కోసం పవన్కళ్యాణ్ వారికోసం ఒక లగ్జరీ ఫ్లాట్ కొనిచ్చాడని రూమర్స్ వినిపించాయి. వాటిని రేణుదేశాయ్ కొట్టి పారేసింది. అయితే తానెక్కడ వున్నదీ ఆమె ఇప్పుడు దాచిపెడుతోంది. పుణెలో వున్నపుడు సోషల్ మీడియాలో ఫోటోలను ఆమె స్వేఛ్ఛగా పోస్ట్ చేసేది.
కానీ ఇప్పుడు తన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ, కార్ నంబర్ ఎడిట్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలావుంటే విలాసవంతమైన తన కార్లను రేణు దేశాయ్ అమ్మేసిందట. ఒక ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిందట. పర్యావరణానికి డీజిల్, పెట్రోల్ కార్లు ఎంత నష్టం చేస్తున్నదీ ఆమె సుదీర్ఘంగా వివరించింది. అందుకే తన వంతుగా ఇకపై ఎలక్ట్రిక్ కారునే వాడతానని, అందరూ అదే విధంగా పర్యావరణం కోసం ఆలోచించాలని రేణు కోరింది.
మారిషస్లో ఆయిల్ స్పిల్ వల్ల జరిగిన అనర్ధం ఆ ప్రాంతానికి తీరని ముప్పు తెచ్చేట్టు వుందని, భవిష్యత్తులో ఇలాంటివి నియంత్రించడానికి అయినా ఆయిల్ రహిత కార్లు, వాహనాల వినియోగానికి మొగ్గు చూపాలని రేణు తన ఫాలోవర్స్ కి చెప్పింది.
This post was last modified on August 12, 2020 12:03 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…