రేణుదేశాయ్ మొన్నామధ్య హైద్రాబాద్కి షిఫ్ట్ అయిపోయినట్టు వార్తలొచ్చాయి. పిల్లలకు అందుబాటులో వుండడం కోసం పవన్కళ్యాణ్ వారికోసం ఒక లగ్జరీ ఫ్లాట్ కొనిచ్చాడని రూమర్స్ వినిపించాయి. వాటిని రేణుదేశాయ్ కొట్టి పారేసింది. అయితే తానెక్కడ వున్నదీ ఆమె ఇప్పుడు దాచిపెడుతోంది. పుణెలో వున్నపుడు సోషల్ మీడియాలో ఫోటోలను ఆమె స్వేఛ్ఛగా పోస్ట్ చేసేది.
కానీ ఇప్పుడు తన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ, కార్ నంబర్ ఎడిట్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలావుంటే విలాసవంతమైన తన కార్లను రేణు దేశాయ్ అమ్మేసిందట. ఒక ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిందట. పర్యావరణానికి డీజిల్, పెట్రోల్ కార్లు ఎంత నష్టం చేస్తున్నదీ ఆమె సుదీర్ఘంగా వివరించింది. అందుకే తన వంతుగా ఇకపై ఎలక్ట్రిక్ కారునే వాడతానని, అందరూ అదే విధంగా పర్యావరణం కోసం ఆలోచించాలని రేణు కోరింది.
మారిషస్లో ఆయిల్ స్పిల్ వల్ల జరిగిన అనర్ధం ఆ ప్రాంతానికి తీరని ముప్పు తెచ్చేట్టు వుందని, భవిష్యత్తులో ఇలాంటివి నియంత్రించడానికి అయినా ఆయిల్ రహిత కార్లు, వాహనాల వినియోగానికి మొగ్గు చూపాలని రేణు తన ఫాలోవర్స్ కి చెప్పింది.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…