Movie News

‘ఏజెంట్’ నుంచి దేవుడే కాపాడాడు

ఈ వేసవిలో విడుదలైన అక్కినేని అఖిల్ సినిమా ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. నిర్మాత చెప్పిన ప్రకారం దీని బడ్జెట్ రూ.80 కోట్లు అయితే.. థియేటర్ల నుంచి అందులో పదో వంతు కూడా షేర్ రూపంలో రాలేదంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ మార్కెట్ చూసుకోకుండా సినిమా మీద అయిన కాడికి బడ్జెట్ పెట్టేసిన నిర్మాత అనిల్ సుంకర నిండా మునిగిపోయాడు.

ముందు అనుకున్న 50 కోట్ల బడ్జెట్టే ఎక్కువ అనుకుంటే.. దాని మీద 30 కోట్లు ఎక్కువ పెట్టడం అన్నది విడ్డూరంగా అనిపించే విషయమే. సినిమాను డెఫిషిట్లో రిలీజ్ చేసినప్పటికీ.. బయ్యర్లకు నష్ట పరిహారం చెల్లించాల్సిన స్థితికి చేరుకున్నాడు. ఈ సినిమాను ఓ మోస్తరు రేట్లకు కొన్నప్పటికీ బయ్యర్లు భారీగా నష్టపోయారు. 

ఐతే ఈ సినిమాను కొనబోయి వెనక్కి తగ్గిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. దేవుడే తమను కాపాడాడంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఏజెంట్’ థియేట్రికల్ హక్కులను తనతో సహా ఆరుగురు కలిపి తీసుకోవాలని అనుకున్నట్లు సునీల్ వెల్లడించాడు. హక్కుల కోసం నిర్మాత అనిల్ సుంకరను సంప్రదిస్తే భారీ రేటు చెప్పారని.. అది తమకు గిట్టుబాటు కాదని భావించి వేరే వాళ్లకు సినిమాను ఇచ్చుకోమని చెప్పి తాము వెనక్కి తగ్గినట్లు సునీల్ తెలిపాడు.

ఈ సినిమా రైట్స్ తీసుకోకుండా దేవుడే తమను కాపాడాడంటూ ఆయన సెటైర్ వేశాడు. అనిల్ సుంకర ఇన్నేళ్లలో సినిమాల ద్వారా సంపాదించిందంతా ఒక్క ‘ఏజెంట్’ సినిమాతో పోగొట్టుకున్నట్లు సన్నిహితుల సమాచారం. ఇప్పుడు ఆయన ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘భోళా శంకర్’ మీదే ఉన్నాయి. ఆగస్టు 11న రిలీజయ్యే ఈ చిత్రం ‘ఏజెంట్’ నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

This post was last modified on June 22, 2023 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

43 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

46 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago