Movie News

ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేతో తెలుగు మూవీ

కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ రేంజ్ ప్యాన్ ఇండియాని మించి వెళ్ళిపోయింది. రెండో సినిమాకే ఈ స్థాయి ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం సలార్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్న ఈ కల్ట్ డైరెక్టర్ కి హోంబాలే ఫిలిమ్స్ అంటే స్వంత బ్యానర్ కన్నా ఎక్కువ. తనను నమ్మి కెజిఎఫ్ మీద అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే సాహసం చేసినందుకు ఇప్పట్లో ఆ సంస్థను వీడేలా లేడు. ఆ అనుబంధం ఎంతగా అంటే ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీకి స్క్రీన్ ప్లే సమకూర్చేటంత. ఒక పక్క చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ కి టాలీవుడ్ డెబ్యూ కావడంతో అన్నీ చూసుకుంటున్నాడు

శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో హోంబాలే ఒక స్ట్రెయిట్ ఫిలిం నిర్మిస్తోంది. కొంత భాగం షూట్ కూడా పూర్తయ్యింది. ఇతని గత చిత్రాలు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, అనుభవించు రాజా రెండూ రాజ్ తరుణ్ తో చేసినవే. ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అయినా ఎన్నో బ్లాక్ బస్టర్ల రచనలో అనుభవమున్న గవిరెడ్డి చెప్పిన ఒక కథ ప్రశాంత్ నీల్ కి నచ్చడంతో ఆయనే కథనం సమకూర్చి మరీ కాంబినేషన్ సెట్ చేశారట. అటవీ నేపథ్యంలో సాగే ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం . ఆర్టిస్టుని లాక్ చేయలేదు.

ఇప్పటిదాకా ఎంచుకున్న క్యాస్టింగ్ లో ఆదర్శ్ బాలకృష్ణ, హరీష్ ఉత్తమన్, బెనర్జీ, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఉన్నాయి. వీళ్ళ మీద కొంత భాగం చిత్రీకరణ పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో చేశారు. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ దీనికీ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్టు టాక్. ప్రస్తుతం చిన్న బడ్జెట్ తో మొదలుపెట్టి క్రమంగా భారీ చిత్రాలకు ప్లాన్ చేస్తున్నారు. సలార్ తెలుగు సినిమానే అయినా హోంబాలే మాత్రం ఫస్ట్ వెంచర్ గా గవిరెడ్డిదే ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి

This post was last modified on June 22, 2023 6:17 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

14 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

14 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

15 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

16 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

16 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

17 hours ago