మామూలుగా కూల్గా వుండే సుకుమార్ ఇటీవల చాలా ఫస్ట్రేషన్లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే మరి… రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన తర్వాత అకారణంగా ఒక దర్శకుడు రెండేళ్లు వృధాగా సమయం గడపాల్సి వస్తే ఆమాత్రం విసుగు, కోపం సహజం. మహేష్ కోసమని కథ రాస్తూ ఏడాదికి పైగా సమయాన్ని సుకుమార్ స్పెండ్ చేసాడు.
కానీ సుకుమార్ని వెయిటింగ్లో పెట్టి అనిల్ రావిపూడి చిత్రం చేయడానికి మహేష్ డిసైడ్ అవడంతో రాత్రికి రాత్రి సుకుమార్ అదే కథ అల్లు అర్జున్కి చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే అక్కడే ఒక పొరపాటు చేసాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమా కమిట్ అయిన అల్లు అర్జున్ వెంటనే సుకుమార్తో సినిమా చేసే పరిస్థితి లేదు. దాంతో సుకుమార్ అక్కడే ఒక ఏడాది ఎదురు చూడాల్సి వచ్చింది. తీరా సినిమా మొదలవుతుందనే సరికి లాక్డౌన్తో మరింత టైమ్ వేస్ట్ అవుతోంది. దీంతో సుకుమార్కి అసహనం పెరిగిపోతోందట.
పుష్ప షూటింగ్ ఈ ఏడాది చివరకు మొదలవుతుందని అనుకున్నా కానీ తనకు షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఏడాది సమయం పడుతుంది. అంటే 2021 సంక్రాంతికి గానీ రిలీజ్ ప్లాన్ చేసుకోలేరు. దర్శకుడిగా సినిమాకు పది కోట్లకు పైగా పారితోషికం తీసుకునే సుకుమార్కి రెండేళ్లు వృధా పోవడమంటే చాలా నష్టం. ఒక్కోసారి హీరోల కోసం ఎదురు చూడడం కంటే ఎవరు రెడీగా వుంటే వారితో సినిమా చేసేయడం ఉత్తమం.
This post was last modified on August 12, 2020 10:53 am
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…