జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర షూటింగ్ స్పీడందుకుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు సైతం ఇదే తొలి టాలీవుడ్ డెబ్యూ. ఆదిపురుష్ లో చేసినా అది హిందీ చిత్రం కాబట్టి కౌంట్ లోకి రాదు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న దేవరకు సంబంధించి ఇప్పటిదాకా ముప్పై శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయినట్టుగా ఇన్ సైడ్ టాక్.
తాజాగా ఈ క్యాస్టింగ్ కి మరో ఆకర్షణ తోడైంది. దసరా విలన్ షైన్ టామ్ చాకో దేవరలో చేరాడు. ఇది తనకు మూడో తెలుగు సినిమా. నాగ శౌర్య రంగబలో ప్రధాన పాత్ర పోషించాడు. దేవరలో తానున్న విషయం స్వయంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేసుకున్న షైన్ టామ్ చాకో మెల్లగా ఇక్కడ మంచి అవకాశాలు పడుతున్నాడు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ తదితరులు రొటీన్ అయిపోయాక సరైన ప్రతినాయకులను ఎంచుకోవడం డైరెక్టర్లకు సవాల్ గా మారింది. అందుకే సలార్ కోసం పృథ్విరాజ్ ని తీసుకొస్తే దేవర కోసం సైఫ్, టామ్ చాకోలు తోడయ్యారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర షూట్ ని వీలైనంత వరకు నవంబర్ కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం ఇచ్చి, అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ కి తగినంత టైం దక్కేలా పక్కా ప్రణాళికతో కొరటాల రెడీగా ఉన్నారు. చివరి నిమిషం దాకా హడావిడి పడి అవుట్ ఫుట్ ని దెబ్బ తీసుకోవడం కన్నా ముందస్తుగా పూర్తి చేసి ప్రమోషన్లకు రెడీ అయ్యేలా సెట్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్ సోలో హీరోగా చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి
This post was last modified on June 21, 2023 11:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…