జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర షూటింగ్ స్పీడందుకుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు సైతం ఇదే తొలి టాలీవుడ్ డెబ్యూ. ఆదిపురుష్ లో చేసినా అది హిందీ చిత్రం కాబట్టి కౌంట్ లోకి రాదు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న దేవరకు సంబంధించి ఇప్పటిదాకా ముప్పై శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయినట్టుగా ఇన్ సైడ్ టాక్.
తాజాగా ఈ క్యాస్టింగ్ కి మరో ఆకర్షణ తోడైంది. దసరా విలన్ షైన్ టామ్ చాకో దేవరలో చేరాడు. ఇది తనకు మూడో తెలుగు సినిమా. నాగ శౌర్య రంగబలో ప్రధాన పాత్ర పోషించాడు. దేవరలో తానున్న విషయం స్వయంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేసుకున్న షైన్ టామ్ చాకో మెల్లగా ఇక్కడ మంచి అవకాశాలు పడుతున్నాడు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ తదితరులు రొటీన్ అయిపోయాక సరైన ప్రతినాయకులను ఎంచుకోవడం డైరెక్టర్లకు సవాల్ గా మారింది. అందుకే సలార్ కోసం పృథ్విరాజ్ ని తీసుకొస్తే దేవర కోసం సైఫ్, టామ్ చాకోలు తోడయ్యారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర షూట్ ని వీలైనంత వరకు నవంబర్ కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం ఇచ్చి, అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ కి తగినంత టైం దక్కేలా పక్కా ప్రణాళికతో కొరటాల రెడీగా ఉన్నారు. చివరి నిమిషం దాకా హడావిడి పడి అవుట్ ఫుట్ ని దెబ్బ తీసుకోవడం కన్నా ముందస్తుగా పూర్తి చేసి ప్రమోషన్లకు రెడీ అయ్యేలా సెట్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్ సోలో హీరోగా చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి
This post was last modified on June 21, 2023 11:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…