ఆదిపురుష్ అంచనాలకు మించి మొదటి మూడు రోజులు ఎలాంటి వసూళ్ల సునామి సృష్టించిందో అంతకు మించి సోమవారం నుంచి దారుణమైన డ్రాప్ తో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో గట్టెక్కిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పరిస్థితి ఇంకా కిందకు వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల వరకు అయిదు కోట్లు గ్రాస్ దాటడమే కష్టమేనేలా ఫిగర్లు నమోదయ్యాయి. చాలా కేంద్రాల్లో షోలు అధికంగా ప్లాన్ చేసుకున్న మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకులను ఒప్పించి ఒకేదాంట్లో సర్దుబాటు చేయడానికి కొన్ని చోట్ల యాజమాన్యాలు ఇబ్బంది పడిన వైనం కనిపించింది.
తెలంగాణలో కొంత వరకు నయమనుకున్నా ఏపీలో పది రోజుల వరకు టికెట్ రేట్ల హైక్ ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే ఆన్ లైన్ బుకింగ్ సెట్ చేసుకున్నారు. తీరా టాక్ బయటికి వచ్చాక తగ్గించే మార్గం ఉన్నప్పటికీ పలు సెంటర్స్ లో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం ప్రేక్షకులను రాకుండా అడ్డుపడుతోంది. పైగా సోషల్ మీడియా నెగటివిటీ ఎంతకీ ఆగడం లేదు. కొన్ని వివాదాలు చెలరేగుతున్నా అవేవి జనాన్ని హాళ్ల దాకా రప్పించలేకపోతున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే ఆదిపురుష్ కు సానుకూలాంశం. ఎంత మేరకు ప్లస్ అవుతుందో చూడాలి
తెలుగు వెర్షన్ హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇంకా భారీ మొత్తం రావాల్సి ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దానికి అనుగుణంగా కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే ఇంకో 75 కోట్ల దాకా వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. స్కూల్ పిల్లలకు, అనాధలకు స్పెషల్ గా ఉచిత షోలు వేస్తున్న దాఖలాలు ఉన్నా వాటి కంట్రిబ్యూషన్ వల్ల పెద్దగా మార్పేమీ ఉండదు. ఫైనల్ గా ఆదిపురుష్ ఫ్లాప్ నుంచి డిజాస్టర్ కు మధ్యలో ఎక్కడో ఒక చోట నిలవడం ఖాయమే. దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ల స్టేట్ మెంట్లు అంతకంత నెగటివిటీని పెంచడం చివరి ట్విస్టు
This post was last modified on June 21, 2023 12:50 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…