ఆదిపురుష్ అంచనాలకు మించి మొదటి మూడు రోజులు ఎలాంటి వసూళ్ల సునామి సృష్టించిందో అంతకు మించి సోమవారం నుంచి దారుణమైన డ్రాప్ తో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో గట్టెక్కిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పరిస్థితి ఇంకా కిందకు వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల వరకు అయిదు కోట్లు గ్రాస్ దాటడమే కష్టమేనేలా ఫిగర్లు నమోదయ్యాయి. చాలా కేంద్రాల్లో షోలు అధికంగా ప్లాన్ చేసుకున్న మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకులను ఒప్పించి ఒకేదాంట్లో సర్దుబాటు చేయడానికి కొన్ని చోట్ల యాజమాన్యాలు ఇబ్బంది పడిన వైనం కనిపించింది.
తెలంగాణలో కొంత వరకు నయమనుకున్నా ఏపీలో పది రోజుల వరకు టికెట్ రేట్ల హైక్ ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే ఆన్ లైన్ బుకింగ్ సెట్ చేసుకున్నారు. తీరా టాక్ బయటికి వచ్చాక తగ్గించే మార్గం ఉన్నప్పటికీ పలు సెంటర్స్ లో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం ప్రేక్షకులను రాకుండా అడ్డుపడుతోంది. పైగా సోషల్ మీడియా నెగటివిటీ ఎంతకీ ఆగడం లేదు. కొన్ని వివాదాలు చెలరేగుతున్నా అవేవి జనాన్ని హాళ్ల దాకా రప్పించలేకపోతున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే ఆదిపురుష్ కు సానుకూలాంశం. ఎంత మేరకు ప్లస్ అవుతుందో చూడాలి
తెలుగు వెర్షన్ హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇంకా భారీ మొత్తం రావాల్సి ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దానికి అనుగుణంగా కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే ఇంకో 75 కోట్ల దాకా వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. స్కూల్ పిల్లలకు, అనాధలకు స్పెషల్ గా ఉచిత షోలు వేస్తున్న దాఖలాలు ఉన్నా వాటి కంట్రిబ్యూషన్ వల్ల పెద్దగా మార్పేమీ ఉండదు. ఫైనల్ గా ఆదిపురుష్ ఫ్లాప్ నుంచి డిజాస్టర్ కు మధ్యలో ఎక్కడో ఒక చోట నిలవడం ఖాయమే. దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ల స్టేట్ మెంట్లు అంతకంత నెగటివిటీని పెంచడం చివరి ట్విస్టు
This post was last modified on June 21, 2023 12:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…