ఆదిపురుష్ అంచనాలకు మించి మొదటి మూడు రోజులు ఎలాంటి వసూళ్ల సునామి సృష్టించిందో అంతకు మించి సోమవారం నుంచి దారుణమైన డ్రాప్ తో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో గట్టెక్కిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పరిస్థితి ఇంకా కిందకు వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల వరకు అయిదు కోట్లు గ్రాస్ దాటడమే కష్టమేనేలా ఫిగర్లు నమోదయ్యాయి. చాలా కేంద్రాల్లో షోలు అధికంగా ప్లాన్ చేసుకున్న మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకులను ఒప్పించి ఒకేదాంట్లో సర్దుబాటు చేయడానికి కొన్ని చోట్ల యాజమాన్యాలు ఇబ్బంది పడిన వైనం కనిపించింది.
తెలంగాణలో కొంత వరకు నయమనుకున్నా ఏపీలో పది రోజుల వరకు టికెట్ రేట్ల హైక్ ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే ఆన్ లైన్ బుకింగ్ సెట్ చేసుకున్నారు. తీరా టాక్ బయటికి వచ్చాక తగ్గించే మార్గం ఉన్నప్పటికీ పలు సెంటర్స్ లో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం ప్రేక్షకులను రాకుండా అడ్డుపడుతోంది. పైగా సోషల్ మీడియా నెగటివిటీ ఎంతకీ ఆగడం లేదు. కొన్ని వివాదాలు చెలరేగుతున్నా అవేవి జనాన్ని హాళ్ల దాకా రప్పించలేకపోతున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే ఆదిపురుష్ కు సానుకూలాంశం. ఎంత మేరకు ప్లస్ అవుతుందో చూడాలి
తెలుగు వెర్షన్ హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇంకా భారీ మొత్తం రావాల్సి ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దానికి అనుగుణంగా కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే ఇంకో 75 కోట్ల దాకా వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. స్కూల్ పిల్లలకు, అనాధలకు స్పెషల్ గా ఉచిత షోలు వేస్తున్న దాఖలాలు ఉన్నా వాటి కంట్రిబ్యూషన్ వల్ల పెద్దగా మార్పేమీ ఉండదు. ఫైనల్ గా ఆదిపురుష్ ఫ్లాప్ నుంచి డిజాస్టర్ కు మధ్యలో ఎక్కడో ఒక చోట నిలవడం ఖాయమే. దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ల స్టేట్ మెంట్లు అంతకంత నెగటివిటీని పెంచడం చివరి ట్విస్టు
This post was last modified on June 21, 2023 12:50 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…