మేమసలు తీసింది రామాయణమే కాదు కేవలం స్ఫూర్తి మాత్రమే తీసుకున్నామని ఆదిపురుష్ రచయిత ఇచ్చిన వీడియో బైట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇతనే స్వయంగా మేము పురాణగాథని ఎలాంటి వక్రీకరణలు లేకుండా తీస్తున్నామని చెప్పడాన్ని నెటిజెన్లు తవ్వి తీసి మరీ చూపించారు. గతంలో దర్శకుడు ఓం రౌత్ హనుమంతుడి గురించి వ్యంగ్యంగా వేసిన ట్వీట్లు, షారుఖ్ ఖాన్ రా వన్ సినిమా మీద సెటైర్లు బయటికి వచ్చాయి. అవన్నీ డిలీట్ చేయడం అయినా స్క్రీన్ షాట్లు సేవ్ కావడం వేరే సంగతి
తాజాగా హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్లో ఆదిపురుష్ తెలుగు వెర్షన్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ నిజంగా ఎవరూ చూడని రావణాసురుడిని న్యూ జనరేషన్ కోసం అలా చూపించామని, రాముడు ఫలానా రూపంలో ఉంటాడని తెలియని ఇరవై ఏళ్ళ వయసులోపు ఉన్న టీనేజర్లు, పిల్లలు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడ ముంబై వాళ్లేమో ఇది రామాయణం కాదంటూంటే ఇక్కడేమో రాముడి కథని కొత్తగా చూపించామని చెబుతున్నారు, సరే సక్సెస్ మీట్ అన్నాక ఇలాంటివి మాములే కానీ ఒకే సినిమాకు సంబంధించి గందరగోళ స్టేట్ మెంట్లు రావడం విచిత్రం
ఈ మధ్యకాలంలో ఏ సినిమాకూ ఇలా జరగలేదన్నది వాస్తవం. మరోపక్క లక్నో, ముంబై లాంటి ప్రాంతాల్లో ఆదిపురుష్ ప్రదర్శనలు ఆపాలని నిరసనకారులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నారు. ముంబైలోని ఒక థియేటర్ లో షో అర్ధాంతరంగా ఆపేయాలని ఓ వ్యక్తి నానా రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత జరుగుతున్నా ఆదిపురుష్ లో నటించిన వారెవరూ బయటకు రాకపోవడం విచిత్రం. టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు అడుగుతున్నా దాటవేస్తున్నారట. ఏం మాట్లాడితే ఏం వివాదం ముంచుకొస్తుందోనని గమ్మున ఉన్నారట. ఇదీ మంచిదే
This post was last modified on June 19, 2023 8:22 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…