గత ఆరు నెలల్లో ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల గురించి జరిగినంత చర్చ తెలుగులో మరే చిత్రం గురించీ జరగలేదు. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. దీన్ని చిత్ర బృందం కూడా పలుమార్లు ఖండించింది. అయినా సరే.. ఆ ప్రచారం ఆగలేదు.
ఐతే ఓటీటీ రిలీజ్ అంటే మొదట్లో కస్సుమన్న కోన వెంకట్.. ఆ తర్వాత కొంచెం స్వరం మార్చాడు. థియేటర్లు తెరుచుకోవడంలో మరీ ఆలస్యం జరిగితే ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిస్తామన్నాడు. ఇప్పుడు చిత్ర బృందం నిజంగానే ఆ దిశగా ఆలోచిస్తున్నట్లుంది.
కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు. జనవరి, ఫిబ్రవరి నెలలకు కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవని.. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాను ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా ఓకే అనే ఆప్షన్లు ఇచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయానికి 18 వేల మంది ఓటింగ్లో పాల్గొనగా.. అందులో 56 శాతం మంది ఓటీటీ ఆప్షన్ ఎంచుకోవడం విశేషం. థియేటర్లలోనే చూస్తామని 29 శాతం మంది అన్నారు. మిగతా 15 శాతం మంది ఎక్కడైనా ఓకే అన్నారు.
థియేటర్లలో చూడాలనుకుంటున్న వారితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఓటీటీకి ఓకే అన్నారు. ప్రేక్షకుల ఉద్దేశం ఇలా ఉన్నపుడు చిత్ర బృందం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదేమో. ఆల్రెడీ ఓటీటీ రిలీజ్కు రెడీ అయ్యే కోన ఇలా పోల్ పెట్టి ఉంటాడని.. కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో నేరుగా రిలీజవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on August 11, 2020 5:23 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…