గత ఆరు నెలల్లో ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల గురించి జరిగినంత చర్చ తెలుగులో మరే చిత్రం గురించీ జరగలేదు. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. దీన్ని చిత్ర బృందం కూడా పలుమార్లు ఖండించింది. అయినా సరే.. ఆ ప్రచారం ఆగలేదు.
ఐతే ఓటీటీ రిలీజ్ అంటే మొదట్లో కస్సుమన్న కోన వెంకట్.. ఆ తర్వాత కొంచెం స్వరం మార్చాడు. థియేటర్లు తెరుచుకోవడంలో మరీ ఆలస్యం జరిగితే ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిస్తామన్నాడు. ఇప్పుడు చిత్ర బృందం నిజంగానే ఆ దిశగా ఆలోచిస్తున్నట్లుంది.
కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు. జనవరి, ఫిబ్రవరి నెలలకు కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవని.. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాను ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా ఓకే అనే ఆప్షన్లు ఇచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయానికి 18 వేల మంది ఓటింగ్లో పాల్గొనగా.. అందులో 56 శాతం మంది ఓటీటీ ఆప్షన్ ఎంచుకోవడం విశేషం. థియేటర్లలోనే చూస్తామని 29 శాతం మంది అన్నారు. మిగతా 15 శాతం మంది ఎక్కడైనా ఓకే అన్నారు.
థియేటర్లలో చూడాలనుకుంటున్న వారితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఓటీటీకి ఓకే అన్నారు. ప్రేక్షకుల ఉద్దేశం ఇలా ఉన్నపుడు చిత్ర బృందం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదేమో. ఆల్రెడీ ఓటీటీ రిలీజ్కు రెడీ అయ్యే కోన ఇలా పోల్ పెట్టి ఉంటాడని.. కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో నేరుగా రిలీజవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on August 11, 2020 5:23 pm
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య…
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…