గత ఆరు నెలల్లో ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల గురించి జరిగినంత చర్చ తెలుగులో మరే చిత్రం గురించీ జరగలేదు. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. దీన్ని చిత్ర బృందం కూడా పలుమార్లు ఖండించింది. అయినా సరే.. ఆ ప్రచారం ఆగలేదు.
ఐతే ఓటీటీ రిలీజ్ అంటే మొదట్లో కస్సుమన్న కోన వెంకట్.. ఆ తర్వాత కొంచెం స్వరం మార్చాడు. థియేటర్లు తెరుచుకోవడంలో మరీ ఆలస్యం జరిగితే ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిస్తామన్నాడు. ఇప్పుడు చిత్ర బృందం నిజంగానే ఆ దిశగా ఆలోచిస్తున్నట్లుంది.
కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు. జనవరి, ఫిబ్రవరి నెలలకు కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవని.. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాను ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా ఓకే అనే ఆప్షన్లు ఇచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయానికి 18 వేల మంది ఓటింగ్లో పాల్గొనగా.. అందులో 56 శాతం మంది ఓటీటీ ఆప్షన్ ఎంచుకోవడం విశేషం. థియేటర్లలోనే చూస్తామని 29 శాతం మంది అన్నారు. మిగతా 15 శాతం మంది ఎక్కడైనా ఓకే అన్నారు.
థియేటర్లలో చూడాలనుకుంటున్న వారితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఓటీటీకి ఓకే అన్నారు. ప్రేక్షకుల ఉద్దేశం ఇలా ఉన్నపుడు చిత్ర బృందం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదేమో. ఆల్రెడీ ఓటీటీ రిలీజ్కు రెడీ అయ్యే కోన ఇలా పోల్ పెట్టి ఉంటాడని.. కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో నేరుగా రిలీజవుతుందని భావిస్తున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…