సరిగ్గా ఇంకో పది రోజుల్లో నిఖిల్ స్పై ప్యాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇంత హడావిడిగా విడుదల చేయడం ఇష్టం లేని నిఖిల్ ముందు ప్రమోషన్ల విషయంలో సుముఖత చూపించాడు. అయితే నిర్మాత పట్టుదల బలంగా ఉండటంతో అవుట్ ఫుట్ లో ఏదైనా తేడా వస్తే తనకూ ఇబ్బందేనని గుర్తించి ఫైనల్ గా ఓకే చెప్పాడు. మొన్నటిదాకా బాలన్స్ ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తూనే ఉన్నారు. దగ్గుబాటి రానాతో చిన్న క్యామియో తాలూకు షూట్ కూడా ఫినిష్ చేశారు. ఇవాళో రేపో నిఖిల్ డబ్బింగ్ కూడా పూర్తవుతుంది. పబ్లిసిటీకి టైం లేకపోయినా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే
ఏది ఎలా ఉన్నా దీన్నో మంచి అవకాశంగానే చూడాలి. ఎందుకంటే 29న ఆదిపురుష్ కు రెండు వారాలు పూర్తవుతాయి. మొదటి మూడు రోజులు వసూళ్లతో బంతాట ఆడేసింది కానీ అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురు కానుంది. పబ్లిక్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇకపై మరీ ఎక్కువ అద్భుతాలు నమోదయ్యే సూచనలు తక్కువే. అలాంటప్పుడు బాక్సాఫీస్ దగ్గర వచ్చే గ్యాప్ నిఖిల్ స్పైకి వరంగా మారుతుంది. ఎలాగూ యాక్షన్ థ్రిల్లర్. నార్త్ ఆడియన్స్ కి సైతం ఇవి బాగా కనెక్ట్ అవుతాయి. పఠాన్ హిట్టయ్యింది ఇదే జానరనే విషయం మర్చిపోకూడదు
ఈ నేపథ్యంలో సరైన టాక్ వస్తే మాత్రం స్పైకి పండగే. కాకపోతే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ప్రమోషన్ పెంచాలి. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం గురించి బ్యాక్ డ్రాప్ కావడంతో అక్కడి జనాలకు మంచి ఆసక్తి ఉంటుంది. కార్తికేయ 2 ఇమేజ్ ఎలాగూ హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇంటర్వ్యూలు ఈవెంట్లకు తగినంత సమయం చేతిలో ఉండదు. ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన స్పైని అయిదు బాషల రిలీజ్ కు ప్లాన్ చేశారు. తగినన్ని థియేటర్లు దొరకబోతున్నాయి సత్యప్రేమ్ కి కథ, ఇండియానా జోన్స్ పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది మరి
This post was last modified on June 19, 2023 11:20 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…