సరిగ్గా ఇంకో పది రోజుల్లో నిఖిల్ స్పై ప్యాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇంత హడావిడిగా విడుదల చేయడం ఇష్టం లేని నిఖిల్ ముందు ప్రమోషన్ల విషయంలో సుముఖత చూపించాడు. అయితే నిర్మాత పట్టుదల బలంగా ఉండటంతో అవుట్ ఫుట్ లో ఏదైనా తేడా వస్తే తనకూ ఇబ్బందేనని గుర్తించి ఫైనల్ గా ఓకే చెప్పాడు. మొన్నటిదాకా బాలన్స్ ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తూనే ఉన్నారు. దగ్గుబాటి రానాతో చిన్న క్యామియో తాలూకు షూట్ కూడా ఫినిష్ చేశారు. ఇవాళో రేపో నిఖిల్ డబ్బింగ్ కూడా పూర్తవుతుంది. పబ్లిసిటీకి టైం లేకపోయినా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే
ఏది ఎలా ఉన్నా దీన్నో మంచి అవకాశంగానే చూడాలి. ఎందుకంటే 29న ఆదిపురుష్ కు రెండు వారాలు పూర్తవుతాయి. మొదటి మూడు రోజులు వసూళ్లతో బంతాట ఆడేసింది కానీ అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురు కానుంది. పబ్లిక్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇకపై మరీ ఎక్కువ అద్భుతాలు నమోదయ్యే సూచనలు తక్కువే. అలాంటప్పుడు బాక్సాఫీస్ దగ్గర వచ్చే గ్యాప్ నిఖిల్ స్పైకి వరంగా మారుతుంది. ఎలాగూ యాక్షన్ థ్రిల్లర్. నార్త్ ఆడియన్స్ కి సైతం ఇవి బాగా కనెక్ట్ అవుతాయి. పఠాన్ హిట్టయ్యింది ఇదే జానరనే విషయం మర్చిపోకూడదు
ఈ నేపథ్యంలో సరైన టాక్ వస్తే మాత్రం స్పైకి పండగే. కాకపోతే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ప్రమోషన్ పెంచాలి. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం గురించి బ్యాక్ డ్రాప్ కావడంతో అక్కడి జనాలకు మంచి ఆసక్తి ఉంటుంది. కార్తికేయ 2 ఇమేజ్ ఎలాగూ హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇంటర్వ్యూలు ఈవెంట్లకు తగినంత సమయం చేతిలో ఉండదు. ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన స్పైని అయిదు బాషల రిలీజ్ కు ప్లాన్ చేశారు. తగినన్ని థియేటర్లు దొరకబోతున్నాయి సత్యప్రేమ్ కి కథ, ఇండియానా జోన్స్ పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది మరి
This post was last modified on June 19, 2023 11:20 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…