సోషల్ మీడియాను ఫాలో అయ్యే తెలుగు వారిలో రాకేష్ మాస్టర్ అంటే తెలియని వాళ్లుండరు. కొరియోగ్రాఫర్గా ఉన్నప్పటి కంటే.. ఆ పని మానేసి యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలయ్యాక ఎంతో పాపులర్ అయిన రాకేష్ మాస్టర్.. హఠాత్తుగా కన్నుమూయడం ఆయన ఫాలోవర్లకు పెద్ద షాక్.
ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగ్గిపెట్టి మచ్చా, సునిశిత్ తదితరులతో కొన్ని రోజుల కిందటే రాకేష్ మాస్టర్ చేసిన సందడి గురించి తెలిసిందే. సదరు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు హల్చల్ చేశాయి. వాటిలో చాలా హుషారుగా కనిపించిన రాకేష్ మాస్టర్.. ఇప్పుడు హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరం.
వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్కు వచ్చిన రాకేష్ మాస్టర్. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. సిటీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందినప్పటికీ రాకేష్ మాస్టర్ అంతగా కోలుకోలేదు. ఆదివారం ఉదయం రాకేష్ మాస్టర్ తన ఇంట్లోనే రక్తవిరోచనాలు చేసుకున్నట్లు సమాచారం. వెంటనే రామ్ నగర్లోని గాంధీ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు అత్యవసర విభాగంలో వైద్యులు రాకేష్ మాస్టర్ ప్రాణాలు కాపాడడం కోసం శత విధాలా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాకేష్ మాస్టర్ ఆసుపత్రిలో అచేతనంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. 90వ దశకంలో పలు చిత్రాలకు రాకేష్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ ఆయన శిష్యుడే. కొన్నేళ్లుగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా సెలబ్రెటీ అయిపోయాడు.
This post was last modified on June 18, 2023 11:14 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…