సోషల్ మీడియాను ఫాలో అయ్యే తెలుగు వారిలో రాకేష్ మాస్టర్ అంటే తెలియని వాళ్లుండరు. కొరియోగ్రాఫర్గా ఉన్నప్పటి కంటే.. ఆ పని మానేసి యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలయ్యాక ఎంతో పాపులర్ అయిన రాకేష్ మాస్టర్.. హఠాత్తుగా కన్నుమూయడం ఆయన ఫాలోవర్లకు పెద్ద షాక్.
ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగ్గిపెట్టి మచ్చా, సునిశిత్ తదితరులతో కొన్ని రోజుల కిందటే రాకేష్ మాస్టర్ చేసిన సందడి గురించి తెలిసిందే. సదరు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు హల్చల్ చేశాయి. వాటిలో చాలా హుషారుగా కనిపించిన రాకేష్ మాస్టర్.. ఇప్పుడు హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరం.
వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్కు వచ్చిన రాకేష్ మాస్టర్. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. సిటీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందినప్పటికీ రాకేష్ మాస్టర్ అంతగా కోలుకోలేదు. ఆదివారం ఉదయం రాకేష్ మాస్టర్ తన ఇంట్లోనే రక్తవిరోచనాలు చేసుకున్నట్లు సమాచారం. వెంటనే రామ్ నగర్లోని గాంధీ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు అత్యవసర విభాగంలో వైద్యులు రాకేష్ మాస్టర్ ప్రాణాలు కాపాడడం కోసం శత విధాలా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాకేష్ మాస్టర్ ఆసుపత్రిలో అచేతనంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. 90వ దశకంలో పలు చిత్రాలకు రాకేష్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ ఆయన శిష్యుడే. కొన్నేళ్లుగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా సెలబ్రెటీ అయిపోయాడు.
This post was last modified on June 18, 2023 11:14 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…