సెలబ్రెటీలు అంతగా పాపులర్ కాని సమయంలో చేసిన వ్యాఖ్యానాలు.. వాళ్ల సోషల్ మీడియా పోస్టులు వివాదాస్పదం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. అతను 2015లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటోంది. ఆ ట్వీట్లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్నది అతడి మీద ఉన్న ఆరోపణ. ఇంతకీ ఆ ట్వీట్లో ఓం రౌత్ ఏమన్నాడో చూద్దాం.
హనుమంతుడు చెవిటి వాడా? మా భవనంలో జనాలు అలాగే అనుకుంటున్నట్లున్నారు. హనుమాన్ జయంతికి విపరీతమైన శబ్ధంతో పాటలు పెడుతున్నారు. అది కూడా సంబంధం లేని పాటలు.. అని ఓం రౌత్ పేర్కొన్నాడు. అది 2015 ఏప్రిల్ 4న చేసిన ట్వీట్. అప్పటికే అతను దర్శకుడిగా ఒక సినిమా తీశాడు. లోకమాన్యః ఏక్ యుగ్ పురుష్ పేరుతో వచ్చిన ఆ చిత్రం మరాఠీలో తెరకెక్కింది. అప్పటికి ఓం రౌత్ అంత పాపులర్ కాదు. కానీ 2020లో వచ్చిన తానాజీ సినిమాతో ఓం పేరు మార్మోగింది. ఆ తర్వాత అతను ఆదిపురుష్ లాంటి మెగా మూవీని డైరెక్ట్ చేశాడు.
హనుమంతుడు చెవిటివాడా అంటూ కించపరిచేలా వ్యాఖ్యానించిన రౌత్ ఇప్పుడు.. రామాయణం మీద సినిమా తీసి, హనుమంతుడికి ఒక సీట్ అంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నాడంటూ అతడి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సినిమాలో హనుమంతుడి డైలాగుల విషయంలోనూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తన ట్వీట్లో ఓం తప్పుగా ఏమీ మాట్లాడలేదని.. హనుమంతుడిని కించపరచలేదని కొందరు తనకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ తప్పేమీ లేకుంటే ఆ ట్వీట్ను ఓం ఎందుకు డెలీట్ చేశాడని తన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…