నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ స్పై ఎన్నో ఊగిసలాటల మధ్య ఈ నెల 29 విడుదల కాబోతున్నట్టు యూనిట్ అధికారికంగా కొత్త పోస్టర్ తో ప్రకటించింది. నిజానికి నిన్నా మొన్నటి వరకు బాలన్స్ ఉన్న చిన్న వర్క్ కోసం నిఖిల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇంకా డబ్బింగ్ కూడా పూర్తి కాలేదని వార్తలు వచ్చాయి. పైగా ప్రమోషన్లకు అసలు టైం లేకపోవడంతో వాయిదా తప్పదని అందరూ కన్ఫర్మ్ గా నమ్ముతూ వచ్చారు. తీరా చూస్తే నిర్మాత రాజశేఖర్ ఇప్పుడీ ప్రకటనతో కొత్త షాక్ ఇచ్చారు.
చేతిలో ఉన్న పన్నెండు రోజుల్లో పబ్లిసిటీని ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీజర్ వచ్చి చాలా వారాలు దాటేసింది. ఆదిపురుష్ మూడ్ నుంచి ప్రేక్షకులు త్వరగానే బయటికి వచ్చేలా ఉన్నారు కానీ స్పై గురించి వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ కావడానికి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చాలా అవసరం. కానీ అతి కొద్దిసమయంలో ఇవన్నీ ఎంత వేగంగా పూర్తి చేయగలరనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారనుంది. కొద్దిరోజుల క్రితం లిరికల్ సాంగ్ వచ్చినా నిఖిల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. తీరా చూస్తే ఇప్పుడీ పరిణామం పట్ల ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది
1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ ఈ స్పై కథ రాసుకున్నారు. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే పొందుపరిచారు. విశాల్ చంద్రశేఖర్-శ్రీచరణ్ పాకాల జంటగా సంగీతం సమకూర్చారు. అయితే హిందీలో అదే రోజు సత్యప్రేమ్ కి కథ మంచి అంచనాలతో వస్తోంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ కొత్త వెర్షన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మరి ఇంత టైట్ షెడ్యూల్ లో స్పైని ఆఘమేఘాల మీద తీసుకొస్తున్నారు. మరి విడుదల లోపు ఏమైనా అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటాయేమో వేచి చూడాలి.
This post was last modified on June 17, 2023 11:43 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…