నైజాంకు సంబంధించి సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ముందు గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ఇప్పుడంటే మైత్రి మేకర్స్ యాక్టివ్ అయ్యారు కానీ గతంలో ఏషియన్, సురేష్, గీతా లాంటి ఒకటి రెండు పెద్ద సంస్థల ఆధిపత్యమే కొనసాగేది. ఆదిపురుష్ కు సంబంధించిన బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు ఒకదశ వరకు ప్రయత్నించి వదిలేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడిగిన అరవై కోట్లు వర్కౌట్ కాదనిపించి సైడ్ అయ్యారు. కట్ చేస్తే మైత్రి అంత మొత్తానికి ఒప్పేసుకుని పంపిణి బాధ్యతలు తీసుకుని హైదరాబాద్ తో సహా నైజామ్ మొత్తం భారీ సంఖ్యలో థియేటర్లు వచ్చేలా చేసుకున్నారు.
ఓపెనింగ్స్ పరంగా భారీ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ వరకు ప్రభాస్ కు తిరుగు లేదు. కానీ అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ జరగాలంటే ఆ ఒక్క ప్రాంతం నుంచే నూటా పది కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇది అంత సులభం కాదు. టాక్ పూర్తి పాజిటివ్ గా లేకపోవడం కొంత ప్రతికూలంగా ఉన్నా పెద్ద ఎత్తున జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రక్షణ కవచంలా నిలబడ్డాయి. సండే వరకు వీటికి ఢోకా లేదు. ఆపై నుంచి కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటే తప్ప ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లదు. దిల్ రాజు ఇంతగా వెనుకడుగు వేయడానికి శాకుంతలం దెబ్బ ఓ కారణమని సన్నిహితుల మాట
గతంలో లైగర్, ఆచార్య తాలూకు వ్యవహారాలు జరిగినప్పుడూ వాటిని వరంగల్ శీనుకి వదిలేసి తప్పుకున్న దిల్ రాజు ఆ నిర్ణయాల వల్ల చాలా సేఫ్ అయ్యారు. ప్రతి సినిమా తనకే కావాలన్న పంతం లేకపోవడం వల్లే ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఆదిపురుష్ కనక యునానిమాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని ఉంటే దిల్ రాజుకి మిస్ చేసుకున్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడది ఏ కోశానా ఉండదు. ఎలాగూ సలార్ తనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ చేజారడం పట్ల ఎలాంటి భావం బయటికి కనిపించనివ్వడం లేదని దిల్ కాంపౌండ్ టాక్
This post was last modified on October 8, 2023 4:39 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…