బాక్సాఫీస్ అంటే ఏదో టికెట్ రేట్లు, అమ్మకాలు, లాభాలు అనే ఆలోచిస్తాం కానీ అసలు మనకు కనిపించని ఎన్నో కోణాలు ఇందులో ఉంటాయి. నిన్న విడుదలైన ఆదిపురుష్ విషయంలో ఎలాంటి టాక్ వచ్చిందో, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నాం. మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందస్తుగా బాగా జరగడం వల్ల బయ్యర్లకు గండం తప్పింది కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గమనిస్తే సోమవారం నుంచి పెద్ద సవాలే ఎదురు కానుంది. ఇక విషయానికి వస్తే ఆదిపురుష్ ఫలితం తాలూకు ప్రభావం పివిఆర్ షేర్ ధరని తగ్గించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో పివిఆర్ ఐనాక్స్ షేర్ ధర అంతకు ముందు ఉన్న దానికన్నా 3.40 శాతం తగ్గిపోయి 1448 రూపాయల దగ్గర క్లోజ్ అయ్యింది. ఆదిపురుష్ విడుదల ముందు పెరుగుదల కనిపిస్తే రివ్యూలు బయటికి వచ్చాక అనూహ్యంగా నెంబర్ తగ్గిపోయింది. ప్రముఖ ట్రేడ్ రీసెర్చ్ అనలిస్టులు ఈ కోణాన్నే హైలైట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అన్ని భాషల వెర్షన్లకు కలిపి పివిఆర్ సంస్థ సుమారు 6 లక్షలకు పైగా టికెట్లను అమ్మేసింది. వీకెండ్ లో దొరకవనే ఉద్దేశంతో ఆడియన్స్ భారీ ఎత్తున ముందస్తుగా కొనేశారు. దీంతో ఆదివారం దాకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి
సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి. గత ఆర్థిక ఫలితాల్లో మూడు వందల కోట్ల దాకా నికర నష్టం చవిచూసిన పివిఆర్ ఐనాక్స్ ఆదిపురుష్ తర్వాత షేర్ వేల్యూ 1879 రూపాయల దాకా వెళ్లొచ్చని అంచనా వేసింది. అదే కనక జరిగితే క్రమంగా లాభాల వైపు మళ్లొచ్చని లెక్కలు కట్టిందట. కానీ జరుగుతున్నది వేరే. వేసవి మొత్తం బాలీవుడ్ కు డ్రై సీజన్ గా మారిపోవడం మల్టీప్లెక్సుల వ్యాపారాన్ని దెబ్బ కొట్టాయి. ఈ ఏడాది మొత్తంలో పఠాన్ ఒక్కటే ఇండస్ట్రీ హిట్ గా నిలవగా మిగిలినవి అందులో సగం స్థాయి కూడా దాటలేదు. ఆదిపురుష్ ఏమైనా మార్పు తెస్తుందేమో చూడాలి
This post was last modified on June 17, 2023 1:09 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…