ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ షాట్స్లో సునీల్ నారంగ్ ఒకరు. తెలంగాణలో మేజర్ థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఏషియన్ మూవీస్ సొంతంగా నిర్మించిన థియేటర్లకు తోడు.. అనేక సింగిల్ స్క్రీన్లు, జంట థయిేటర్లను రెనొవేట్ చేసి వాటి రూపు రేఖలే మార్చేసింది. అలాగే సొంతంగా సెలబ్రెటీల భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ సముదాయాలను కూడా నిర్మిస్తూ వాటికి మంచి క్రేజ్ తీసుకొస్తోంది ఏషియన్ సంస్థ.
హైదరాబాద్లో మహేష్ బాబుతో కలిసి ఏషియన్ వాళ్లు నిర్మించిన ‘ఏఎంబీ’ను బ్లాక్బస్టర్ మల్టీప్లెక్స్గా చెప్పొచ్చు. మొదలైన నాటి నుంచి మంచి క్రేజ్, డిమాండ్తో నడుస్తోంది ఏఎంబీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్నగర్లో ‘ఏవీడీ సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించగా.. అక్కడా మంచి రెస్పాన్సే వస్తోంది. తాజాగా అల్లు అర్జున్తో కలిసి అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో నిర్మించిన ‘ఏఏఏ’ మల్టీప్లెక్స్ ఈ శుక్రవారమే అందుబాటులోకి రానుంది.
ఏషియన్ వాళ్లు ఈ సెలబ్రెటీ అసోసియేటెడ్ మల్టీప్లెక్స్ నిర్మాణాలను ఇక ముందూ కొనసాగించనున్నారు. తొలిసారి వాళ్లు తెలంగాణను దాటుతున్నారు. అలా అని వాళ్లు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్కు కాదు.. తమిళనాడుకు. చెన్నైలో ఒక భారీ మల్టీప్లెక్స్ను ఏషియన్ వాళ్లు నిర్మించబోతున్నారు.
అక్కడ వాళ్లు అసోసియేట్ కాబోతోంది యువ కథానాయకుడు శివ కార్తికేయన్తో. తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన శివకు యూత్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. శివతో ఏషియన్ వాళ్లు ‘ప్రిన్స్’ సినిమా చేసినపుడు తనతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ బంధాన్ని ఇప్పుడు వ్యాపారంలోకి తీసుకెళ్తున్నారు. శివ భాగస్వామ్యంతో చెన్నైలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. చూస్తుంటే ఏషియన్ థియేటర్ బిజినెస్ దేశమంతా విస్తరించేలా కనిపిస్తోంది.
This post was last modified on June 16, 2023 10:44 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…