ఆస్కార్ దాకా తెలుగు సినిమాను తీసుకెళ్లిన జక్కన్న మీద ఇలాంటి కామెంట్ చేస్తే మూవీ లవర్స్ కి నచ్చదేమో కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మాత్రం ప్రభాస్ మేనియాకున్న బలమెంతో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు విపరీతమైన ప్రమోషన్లు జరిగాయి. దేశం మొత్తం తిరిగి పబ్లిసిటీ చేశారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అడిగిన మీడియా అందరికీ వీడియో ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు నెలల తరబడి చేశారు.
దానికి తగ్గ గొప్ప ఫలితం రావడం సంతోష పడాల్సిన విషయమే. అయితే ఆదిపురుష్ కు అవేవీ జరగలేదు. తిరుపతిలో గ్రాండ్ గా జరిపిన ప్రీ రిలీజ్ వేడుక తప్ప మరో ఈవెంట్ లేదు. ప్రభాస్ యుఎస్ వెళ్ళిపోయాడు. రిలీజయ్యాకే ఇండియా తిరిగి వస్తాడు. దర్శకుడు ఓం రౌత్, టి సిరీస్ అధినేతలు చివరి నిమిషం బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల కేటాయింపులో తలమునకలై ఉన్నారు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ బయట కనిపించడం లేదు. అయినా సరే ఆదిపురుష్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. తెలంగాణ, ఏపీలో యాభై రూపాయల పెంపుతో అనుమతులు రావడం ఆలస్యం సోల్డ్ అవుట్ అవుతున్నాయి
రాముడి సెంటిమెంట్ ఇక్కడ కీలక పాత్ర పోషించినా అది ప్రభాస్ చేయడం వల్లే ఇంత రేంజ్ అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. నార్త్ లో షోలు ఎన్ని వేస్తున్నా చాలడం లేదు. కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు వేల టికెట్లు వితరణ చేస్తున్నా మొత్తం కలెక్షన్లో వాటి పాత్ర నామమాత్రం కాబట్టి అదేం పెద్ద లెక్క కాదు. కానీ హైక్ ఉన్నా కూడా జనం ఈ స్థాయిలో బుక్ చేసుకుంటున్నారంటే ఆదిపురుష్ జ్వరం ఏ స్థాయిలో పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండు ట్రైలర్లు, ఒక ఆడియో ఆల్బమ్ తో సాధించిన ఘనత ఇది. అందుకే రాజమౌళి మార్కెటింగ్ చేయకపోయినా దాన్ని దాటేలా రికార్డులు వచ్చేలా ఉన్నాయి
This post was last modified on June 14, 2023 11:23 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…