సినిమా తీసేది దర్శకుడు. కాబట్టి ఫలానా దర్శకుడి సినిమాలో క్వాలిటీ ఉంటుంది.. ఆ దర్శకుడి చిత్రమైతే భిన్నంగా ఉంటుంది అని నమ్మి జనాలు సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఒక హీరో సినిమాలో బలమైన కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని కోట్ల మంది నమ్మి సినిమాలకు వెళ్లే నమ్మకం కలిగించి హీరో ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ సినిమాల వరుస చూస్తే చెప్పేయొచ్చు ఆమిర్ సినిమాల క్వాలిటీ ఏంటో. ఎప్పుడో కానీ అతడి సినిమాలు తేడా కొట్టవు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ కోవలోని చిత్రమే. ఇది విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక ఏడాది విరామం తీసుకుని హలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ను పట్టాలెక్కించాడు ఆమిర్.
లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ఆమిర్ ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఐదు నెలలుగా షూటింగ్ జరగట్లేదు. వచ్చే కొన్ని నెలల్లోనూ చిత్రీకరణ సాధ్యపడేలా లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికో.. లేదంటే ఇండిపెండెన్స్ డే సీజన్కో వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ ఆమిర్ మాత్రం తనకెంతో ఇష్టమైన క్రిస్మస్ సీజన్లోనే సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడని ఆమిర్.. ఆ ఉద్దేశంతోనే కాస్త ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాడు. ఆమిర్ మిత్రుడైన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on August 11, 2020 2:09 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…