సినిమా తీసేది దర్శకుడు. కాబట్టి ఫలానా దర్శకుడి సినిమాలో క్వాలిటీ ఉంటుంది.. ఆ దర్శకుడి చిత్రమైతే భిన్నంగా ఉంటుంది అని నమ్మి జనాలు సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఒక హీరో సినిమాలో బలమైన కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని కోట్ల మంది నమ్మి సినిమాలకు వెళ్లే నమ్మకం కలిగించి హీరో ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ సినిమాల వరుస చూస్తే చెప్పేయొచ్చు ఆమిర్ సినిమాల క్వాలిటీ ఏంటో. ఎప్పుడో కానీ అతడి సినిమాలు తేడా కొట్టవు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ కోవలోని చిత్రమే. ఇది విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక ఏడాది విరామం తీసుకుని హలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ను పట్టాలెక్కించాడు ఆమిర్.
లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ఆమిర్ ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఐదు నెలలుగా షూటింగ్ జరగట్లేదు. వచ్చే కొన్ని నెలల్లోనూ చిత్రీకరణ సాధ్యపడేలా లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికో.. లేదంటే ఇండిపెండెన్స్ డే సీజన్కో వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ ఆమిర్ మాత్రం తనకెంతో ఇష్టమైన క్రిస్మస్ సీజన్లోనే సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడని ఆమిర్.. ఆ ఉద్దేశంతోనే కాస్త ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాడు. ఆమిర్ మిత్రుడైన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on August 11, 2020 2:09 am
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…