సినిమా తీసేది దర్శకుడు. కాబట్టి ఫలానా దర్శకుడి సినిమాలో క్వాలిటీ ఉంటుంది.. ఆ దర్శకుడి చిత్రమైతే భిన్నంగా ఉంటుంది అని నమ్మి జనాలు సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఒక హీరో సినిమాలో బలమైన కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని కోట్ల మంది నమ్మి సినిమాలకు వెళ్లే నమ్మకం కలిగించి హీరో ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ సినిమాల వరుస చూస్తే చెప్పేయొచ్చు ఆమిర్ సినిమాల క్వాలిటీ ఏంటో. ఎప్పుడో కానీ అతడి సినిమాలు తేడా కొట్టవు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ కోవలోని చిత్రమే. ఇది విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక ఏడాది విరామం తీసుకుని హలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ను పట్టాలెక్కించాడు ఆమిర్.
లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ఆమిర్ ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఐదు నెలలుగా షూటింగ్ జరగట్లేదు. వచ్చే కొన్ని నెలల్లోనూ చిత్రీకరణ సాధ్యపడేలా లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికో.. లేదంటే ఇండిపెండెన్స్ డే సీజన్కో వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ ఆమిర్ మాత్రం తనకెంతో ఇష్టమైన క్రిస్మస్ సీజన్లోనే సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడని ఆమిర్.. ఆ ఉద్దేశంతోనే కాస్త ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాడు. ఆమిర్ మిత్రుడైన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on August 11, 2020 2:09 am
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…