నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన భగవంత్ కేసరి టీజర్ చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరాకు విడుదల కాబోతోంది. ఇవాళ నరసింహనాయుడు ఫోర్ కె రీ రిలీజ్ సంబరాలతో భగవంత్ కేసరి చేతులు కలిపాడు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబోతున్న మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. కథ గురించి పెద్దగా క్లూస్ ఇవ్వలేదు కానీ కేసరి క్యారెక్టరైజేషన్ గురించి మంచి మెటీరియల్ ఇచ్చారు.
భగవంత్ కేసరి(బాలకృష్ణ) ఎవరినీ లెక్క చేయని తత్వం. ఖైదీ నెంబర్ 108గా జైలు జీవితం గడిపి వచ్చాక తన చిరకాల శత్రువు(అర్జున్ రామ్ పాల్) ప్రమాదాలతో స్వాగతం చెబుతాడు. అయితే చేతిలో ఆయుధం ఉంటే చుట్టూ ఎంత మంది ఉన్నారు, ఏమేం చేస్తారనేది పట్టించుకోకుండా ఊచకోత చేయడమే లక్ష్యంగా పెట్టుకునే కేసరికి వాళ్ళెవరూ అడ్డు పడరు. మొండివాడు వాడి వెనుక ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడనే డైలాగ్ తో కేసరి వ్యక్తిత్వం గురించి హిట్ ఇచ్చేశాడు రావిపూడి. హిందీలో చెప్పే సామెత, యాక్షన్ విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కి కనుల పండులా ఉన్నాయి
విజయదశమికి రాబోతున్న భగవంత్ కేసరి మీద హైప్ ని ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లేలా టీజర్ ని కట్ చేశారు. తెల్లని గెడ్డం, నల్లని జుత్తు, రగ్డ్ లుక్ తో బాలయ్య విశ్వరూపం మరోసారి చూడొచ్చన్న మాట. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కానీ ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీలీలను ఇందులో రివీల్ చేయలేదు. అర్జున్ రామ్ పాల్ ఫ్రేమ్స్ మొదట్లోనే ఓపెన్ చేశారు. టీజర్ చివర్లో బాలయ్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని గిటార్ లా పాత పాటకు హమ్మింగ్ చేసుకుంటూ ముగించడం బాగుంది. మొత్తానికి భగవంత్ కేసరి విస్ఫోటనం శాంపులే ఈ రేంజ్ లో ఉంటే ఇక అసలు కంటెంట్ కోసం వెయిట్ చేయడం కష్టమే
This post was last modified on June 10, 2023 11:51 am
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…