నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన భగవంత్ కేసరి టీజర్ చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరాకు విడుదల కాబోతోంది. ఇవాళ నరసింహనాయుడు ఫోర్ కె రీ రిలీజ్ సంబరాలతో భగవంత్ కేసరి చేతులు కలిపాడు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబోతున్న మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. కథ గురించి పెద్దగా క్లూస్ ఇవ్వలేదు కానీ కేసరి క్యారెక్టరైజేషన్ గురించి మంచి మెటీరియల్ ఇచ్చారు.
భగవంత్ కేసరి(బాలకృష్ణ) ఎవరినీ లెక్క చేయని తత్వం. ఖైదీ నెంబర్ 108గా జైలు జీవితం గడిపి వచ్చాక తన చిరకాల శత్రువు(అర్జున్ రామ్ పాల్) ప్రమాదాలతో స్వాగతం చెబుతాడు. అయితే చేతిలో ఆయుధం ఉంటే చుట్టూ ఎంత మంది ఉన్నారు, ఏమేం చేస్తారనేది పట్టించుకోకుండా ఊచకోత చేయడమే లక్ష్యంగా పెట్టుకునే కేసరికి వాళ్ళెవరూ అడ్డు పడరు. మొండివాడు వాడి వెనుక ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడనే డైలాగ్ తో కేసరి వ్యక్తిత్వం గురించి హిట్ ఇచ్చేశాడు రావిపూడి. హిందీలో చెప్పే సామెత, యాక్షన్ విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కి కనుల పండులా ఉన్నాయి
విజయదశమికి రాబోతున్న భగవంత్ కేసరి మీద హైప్ ని ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లేలా టీజర్ ని కట్ చేశారు. తెల్లని గెడ్డం, నల్లని జుత్తు, రగ్డ్ లుక్ తో బాలయ్య విశ్వరూపం మరోసారి చూడొచ్చన్న మాట. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కానీ ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీలీలను ఇందులో రివీల్ చేయలేదు. అర్జున్ రామ్ పాల్ ఫ్రేమ్స్ మొదట్లోనే ఓపెన్ చేశారు. టీజర్ చివర్లో బాలయ్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని గిటార్ లా పాత పాటకు హమ్మింగ్ చేసుకుంటూ ముగించడం బాగుంది. మొత్తానికి భగవంత్ కేసరి విస్ఫోటనం శాంపులే ఈ రేంజ్ లో ఉంటే ఇక అసలు కంటెంట్ కోసం వెయిట్ చేయడం కష్టమే
This post was last modified on June 10, 2023 11:51 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…