నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన భగవంత్ కేసరి టీజర్ చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరాకు విడుదల కాబోతోంది. ఇవాళ నరసింహనాయుడు ఫోర్ కె రీ రిలీజ్ సంబరాలతో భగవంత్ కేసరి చేతులు కలిపాడు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబోతున్న మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. కథ గురించి పెద్దగా క్లూస్ ఇవ్వలేదు కానీ కేసరి క్యారెక్టరైజేషన్ గురించి మంచి మెటీరియల్ ఇచ్చారు.
భగవంత్ కేసరి(బాలకృష్ణ) ఎవరినీ లెక్క చేయని తత్వం. ఖైదీ నెంబర్ 108గా జైలు జీవితం గడిపి వచ్చాక తన చిరకాల శత్రువు(అర్జున్ రామ్ పాల్) ప్రమాదాలతో స్వాగతం చెబుతాడు. అయితే చేతిలో ఆయుధం ఉంటే చుట్టూ ఎంత మంది ఉన్నారు, ఏమేం చేస్తారనేది పట్టించుకోకుండా ఊచకోత చేయడమే లక్ష్యంగా పెట్టుకునే కేసరికి వాళ్ళెవరూ అడ్డు పడరు. మొండివాడు వాడి వెనుక ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడనే డైలాగ్ తో కేసరి వ్యక్తిత్వం గురించి హిట్ ఇచ్చేశాడు రావిపూడి. హిందీలో చెప్పే సామెత, యాక్షన్ విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కి కనుల పండులా ఉన్నాయి
విజయదశమికి రాబోతున్న భగవంత్ కేసరి మీద హైప్ ని ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లేలా టీజర్ ని కట్ చేశారు. తెల్లని గెడ్డం, నల్లని జుత్తు, రగ్డ్ లుక్ తో బాలయ్య విశ్వరూపం మరోసారి చూడొచ్చన్న మాట. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కానీ ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీలీలను ఇందులో రివీల్ చేయలేదు. అర్జున్ రామ్ పాల్ ఫ్రేమ్స్ మొదట్లోనే ఓపెన్ చేశారు. టీజర్ చివర్లో బాలయ్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని గిటార్ లా పాత పాటకు హమ్మింగ్ చేసుకుంటూ ముగించడం బాగుంది. మొత్తానికి భగవంత్ కేసరి విస్ఫోటనం శాంపులే ఈ రేంజ్ లో ఉంటే ఇక అసలు కంటెంట్ కోసం వెయిట్ చేయడం కష్టమే
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…