Movie News

బాలయ్య రవితేజ కోసం ఇద్దరు వెనక్కు

దసరా ఇంకో నాలుగు నెలలు ఉండగానే బాక్సాఫీస్ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. సంక్రాంతి రేంజ్ లో స్టార్ హీరోలు నువ్వా నేనా అని తలపడేందుకు సిద్ధం కావడంతో డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు పలు అనూహ్య నిర్ణయాలు చోటు చేసుకోవచ్చని ఇన్ సైడ్ టాక్. బాలకృష్ణ భగవంత్ కేసరి విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. విజయదశమిని ఎప్పుడో లాక్ చేసుకుంది కాబట్టి రేపు టీజర్ లో డేట్ ని మరోసారి హై లైట్ చేస్తే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు వెనక్కు తగ్గే అవకాశం లేనట్టే. పండక్కే కట్టుబడదామని టీమ్ డిసైడ్ అయ్యిందట.

రామ్ బోయపాటి శీను కలయికలో రూపొందుతున్న సినిమాని ప్రీపోన్ చేసే ఆలోచన జరుగుతున్నట్టు వినికిడి. స్వతహాగా బాలయ్యతో తలపడటం ఇష్టం లేని బోయపాటి ఆ మేరకు నిర్మాతలను ఒప్పించి వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ ని జరిపి సాధ్యమైతే సెప్టెంబర్ విడుదల ప్రతిపాదనను ముందుంచుతారట. ఇది తేలడానికి కొంత టైం పట్టొచ్చు. అదే సీజన్ ని లక్ష్యంగా చేసుకున్న విజయ్ లియోని వారం ముందు అంటే అక్టోబర్ 12న తెచ్చే డిస్కషన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ టీమ్ లో జరుగుతోంది. ఒకవేళ హీరో అంగీకారం తెలిపితే అనౌన్స్ మెంట్ ఇస్తారు.

లియోకి ఓ రిస్క్ ఉంది. తమిళంలో ఇబ్బంది లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుల వల్ల థియేటర్ల ఇబ్బంది వస్తుంది. దాని వల్ల రెవిన్యూ ప్రభావితం అవుతుంది. లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్, తీసుకున్న గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ వర్కౌట్ కావాలంటే కమల్ హాసన్ విక్రమ్ లాగా సోలో అడ్వాంటేజ్ తీసుకోవాలి. అందుకే లియో తేదీ మారినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఒకపక్క షూటింగ్ జరుపుతూనే ఈ రెండు బృందాలు రిలీజ్ డేట్ మీద మల్లగులాలు పడుతున్నాయి. వెనక్కు తగ్గదేవరో ముందుకెళ్ళేది ఎవరో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది 

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

9 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

40 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago