సామాజిక సమస్యలు, వెనుకబాటు వర్గాల అణిచివేత మీద గొప్ప చిత్రాలు తీస్తాడని పేరున్న దర్శకుడు వెట్రిమారన్ కు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విడుదల పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిలైనా ఓటిటిలో చూసిన ఆడియన్స్ అందులో కంటెంట్ కి షాక్ అయ్యారు. ఈ కాలంలో ఇలాంటి కథలను చెప్పే డైరెక్టర్లు ఉన్నారాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోలీవుడ్ లో పార్ట్ 2 మీద మంచి క్రేజ్ ఉంది. విజయ్ సేతుపతికి సంబంధించి అసలు స్టోరీ అందులోనే ఉండటంతో సరైన రిలీజ్ డేట్ కోసం టీమ్ ఎదురుచూస్తోంది
దీని సంగతలా ఉంచితే వెట్రిమారన్ దగ్గర గతంలో తీసి థియేటర్లో కానీ ఓటిటిలో కానీ వదలకుండా ఉన్న సినిమా ఒకటుందని చెన్నై టాక్. దాని పేరు రాజన్ వగైయర. ధనుష్ తో చేసిన వడ చెన్నైకి ప్రీక్వెల్ గా దీన్ని రూపొందించారట. ఈ సిరీస్ ని మొత్తం మూడు భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే థర్డ్ పార్ట్ కి పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడంతో రాజన్ వగైయరని అలాగే భద్రంగా ల్యాబ్ లో ఉంచినట్టు వినికిడి. దీన్ని బయటికి తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ భాగంలో ధనుష్ ఉన్నాడా లేదనేది సస్పెన్స్ గా ఉంది.
భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో చేసే అవకాశం గురించి సంకేతాలు బలంగా ఉన్న నేపథ్యంలో వెట్రిమారన్ టాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. తారక్ తో ప్రాజెక్టు సెట్ అవుతుందో లేదో కానీ ఈ కాంబోలో ఒక ప్యాన్ ఇండియా మూవీ రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అసురన్ తరహా సబ్జెక్టు ఒకటి పడితే జూనియర్ విశ్వరూపాన్ని వెట్రిమారన్ పూర్తిగా వాడుకుంటాడని వాళ్ళ ఫీలింగ్. ప్రస్తుతం సూర్య వడి వాసల్ తో బిజీగా ఉన్న ఈ విలక్షణ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో చేయబోయేది చాలా గుట్టుగా ఉంచుతున్నారు. ఇంకో అయిదారు నెలలు ఆగాల్సిందే
This post was last modified on June 9, 2023 2:25 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…