కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఇంకా అభిమానుల మనసులో నుంచి చెరిగిపోలేదు. తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితం కాకపోయినా అతనెంత గొప్పవాడో పలు రకాల వీడియోలు, కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న టాలీవుడ్ ఫ్యాన్స్ తన మీద ప్రత్యేక గౌరవం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. చనిపోవడానికి ముందు కెజిఎఫ్ బ్యానర్ కు పునీత్ రెండు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. అందులో యువరత్న విడుదలై సక్సెస్ సాధించింది. రెండోది ధూమం అనౌన్స్ మెంట్ వచ్చాక విషాదం జరిగిపోయి పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు
ఇప్పుడా ధూమంని పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తో పూర్తి చేశారు హోంబాలే ఫిలింస్. జూన్ 23న తెలుగుతో పాటు సౌత్ భాషలు అన్నిటిలోనూ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. థియేటర్లలో ఏదైనా సినిమా షో వేయడానికి ముందు పొగతాగితే వచ్చే పర్యవసనాలను వీడియో రూపంలో హెచ్చరికగా చూపిస్తారు. కానీ జనం వాటిని సీరియస్ గా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ దాన్ని నిజంగా చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హీరో లైఫ్ ని ప్రమాదంలోకి నెడుతుంది. అదేంటనేది రెండు వారాలు ఆగితే తెలుస్తుంది
పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అపర్ణ బాలమురళి, ప్రేమదేశం వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్ ప్రధాన తారాగణం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిలర్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు పవన్ కుమార్. ఈయన గత చిత్రం యుటర్న్ కన్నడలో ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధూమంలో కూడా ఊహకందని ట్విస్టులు చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సస్పెన్స్ డ్రామా ఏదో స్పెషల్ గానే ఉండబోతోంది. ఆదిపురుష్ వచ్చిన వారానికే ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం
This post was last modified on June 9, 2023 10:49 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…