కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఇంకా అభిమానుల మనసులో నుంచి చెరిగిపోలేదు. తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితం కాకపోయినా అతనెంత గొప్పవాడో పలు రకాల వీడియోలు, కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న టాలీవుడ్ ఫ్యాన్స్ తన మీద ప్రత్యేక గౌరవం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. చనిపోవడానికి ముందు కెజిఎఫ్ బ్యానర్ కు పునీత్ రెండు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. అందులో యువరత్న విడుదలై సక్సెస్ సాధించింది. రెండోది ధూమం అనౌన్స్ మెంట్ వచ్చాక విషాదం జరిగిపోయి పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు
ఇప్పుడా ధూమంని పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తో పూర్తి చేశారు హోంబాలే ఫిలింస్. జూన్ 23న తెలుగుతో పాటు సౌత్ భాషలు అన్నిటిలోనూ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. థియేటర్లలో ఏదైనా సినిమా షో వేయడానికి ముందు పొగతాగితే వచ్చే పర్యవసనాలను వీడియో రూపంలో హెచ్చరికగా చూపిస్తారు. కానీ జనం వాటిని సీరియస్ గా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ దాన్ని నిజంగా చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హీరో లైఫ్ ని ప్రమాదంలోకి నెడుతుంది. అదేంటనేది రెండు వారాలు ఆగితే తెలుస్తుంది
పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అపర్ణ బాలమురళి, ప్రేమదేశం వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్ ప్రధాన తారాగణం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిలర్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు పవన్ కుమార్. ఈయన గత చిత్రం యుటర్న్ కన్నడలో ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధూమంలో కూడా ఊహకందని ట్విస్టులు చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సస్పెన్స్ డ్రామా ఏదో స్పెషల్ గానే ఉండబోతోంది. ఆదిపురుష్ వచ్చిన వారానికే ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం
This post was last modified on June 9, 2023 10:49 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…