కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఇంకా అభిమానుల మనసులో నుంచి చెరిగిపోలేదు. తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితం కాకపోయినా అతనెంత గొప్పవాడో పలు రకాల వీడియోలు, కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న టాలీవుడ్ ఫ్యాన్స్ తన మీద ప్రత్యేక గౌరవం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. చనిపోవడానికి ముందు కెజిఎఫ్ బ్యానర్ కు పునీత్ రెండు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. అందులో యువరత్న విడుదలై సక్సెస్ సాధించింది. రెండోది ధూమం అనౌన్స్ మెంట్ వచ్చాక విషాదం జరిగిపోయి పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు
ఇప్పుడా ధూమంని పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తో పూర్తి చేశారు హోంబాలే ఫిలింస్. జూన్ 23న తెలుగుతో పాటు సౌత్ భాషలు అన్నిటిలోనూ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. థియేటర్లలో ఏదైనా సినిమా షో వేయడానికి ముందు పొగతాగితే వచ్చే పర్యవసనాలను వీడియో రూపంలో హెచ్చరికగా చూపిస్తారు. కానీ జనం వాటిని సీరియస్ గా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ దాన్ని నిజంగా చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హీరో లైఫ్ ని ప్రమాదంలోకి నెడుతుంది. అదేంటనేది రెండు వారాలు ఆగితే తెలుస్తుంది
పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అపర్ణ బాలమురళి, ప్రేమదేశం వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్ ప్రధాన తారాగణం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిలర్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు పవన్ కుమార్. ఈయన గత చిత్రం యుటర్న్ కన్నడలో ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధూమంలో కూడా ఊహకందని ట్విస్టులు చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సస్పెన్స్ డ్రామా ఏదో స్పెషల్ గానే ఉండబోతోంది. ఆదిపురుష్ వచ్చిన వారానికే ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం
This post was last modified on June 9, 2023 10:49 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…