అనుపమ పరమేశ్వర్ మలయాళ అమ్మాయే అయినా.. ఆమె తెరంగేట్రం చేసింది కూడా మాలీవుడ్లోనే అయినా.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.. ఎక్కువ పేరు సంపాదించింది మాత్రం తెలుగులోనే. ప్రేమమ్ తెలుగు వెర్షన్తో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అఆ, శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
కానీ ఆ ఆపై కొన్ని ఫ్లాపులు ఎదుర్కొని ఒక టైంలో తెలుగులో సినిమాలే లేని పరిస్థితికి చేరుకుంది. ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకుంటున్న టైంలో మళ్లీ అనుపమకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. రౌడీ బాయ్స్, 18 పేజెస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ రింగుల జుత్తు అమ్మాయి.. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమె కొత్తగా తెలుగులో మరో సినిమాను అంగీకరించింది.
‘సినిమా బండి’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో నటించబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజ్-డీకే నిర్మించిన ‘సినిమా బండి’ నెట్ఫ్లిక్స్లో రిలీజై మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అట.
అనుపమ మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ.. తెలుగులో ఇంత వరకు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆమెకు అంత మార్కెట్ స్టామినా లేదన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదేమో. కానీ ‘సినిమా బండి’ లాంటి రియలిస్టిక్ మూవీతో వినోదాన్ని పంచిన ప్రవీణ్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుండటం విశేషమే. ప్రస్తుతం అనుపమ ‘టిల్లు స్క్వేర్’తో పాటు రవితేజ సరసన ‘ఈగల్’లోనూ నటిస్తోంది.
This post was last modified on June 8, 2023 7:11 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…