Movie News

ఇంకో రామాయణం అవసరమా అధ్యక్షా

చూస్తుంటే బాలీవుడ్ రామాయణం ఫీవర్ లో మునిగి తేలేలా ఉంది. ఆదిపురుష్ కు విడుదల ముందే వస్తున్న స్పందన, ప్రేక్షకుల్లో కలుగుతున్న ఆసక్తిని చూసి అదే కథను తాము చెప్పాలన్న తాపత్రయం ఇతర దర్శక నిర్మాతల్లో పెరిగిపోతోంది. దంగల్ లాంటి స్పోర్ట్స్ డ్రామా  అద్భుతంగా తీసిన నితీష్ తివారి రఘురాముడి చరితాన్ని తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. నిజ జీవిత భార్యాభర్తలు రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారనే వార్త ప్రస్తుతం ముంబై మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ ఫలితం ముందే ఈ న్యూస్ రావడం గమనార్హం.

ఇంకో పెద్ద ట్విస్టు ఏంటంటే రావణాసురుడిగా కెజిఎఫ్ ఫేమ్ యష్ ని ట్రై చేస్తారట. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ సమయం ఎంత వృధా అవుతున్న లెక్కచేయని యష్ విలన్ షేడ్స్ ఉండే రావణుడిగా కనిపించడం దాదాపు అసాధ్యం. అల్లు అరవింద్, మధు మంతెనలు నిర్మాణ భాగస్వాములుగా ఉంటారని కూడా ప్రచారమవుతోంది. గతంలో ఇదే తరహాలో రకరకాల కాంబినేషన్లతో ప్రచారాలు జరిగాయి కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. మలయాళంలోనూ ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ట్రై చేసి వర్కౌట్ కాదని సైలెంట్ అయ్యారు

ఎంత అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతున్నా మరీ ఇన్నేసి రామాయణ సినిమాలు రావడం సేఫ్ కాదు. ఎందుకంటే గ్రాఫిక్స్ ఎన్ని వాడినా మూల కథను మార్చడం అసాధ్యం. క్రియేటివ్ లిబర్టీ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఏ చిన్న పొరపాటు చేసినా మనోభావాలు దెబ్బ తింటాయి. అలాంటప్పుడు మళ్ళీ అదే గాథను తీసుకోవడం సాహసమే. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది. ఆదిపురుష్ రిజల్ట్ వచ్చాక నిర్ణయం మారుతుందేమో. రన్బీర్ కపూర్ సంగతేమో కానీ పెర్ఫార్మన్స్ కోణంలో చూసుకుంటే సీతగా అలియా భట్ మంచి ఛాయస్ అయ్యేలా ఉంది.

This post was last modified on June 8, 2023 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago