ఒకే ఒక్క కన్ను గీటే వీడియోతో మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఒరు అడార్ లవ్ అనే సినిమా మేకింగ్ దశల ఉండగా.. అందులోంచి రిలీజ్ చేసిన వీడియోలో అమె కన్ను గీటే దృశ్యానికి కుర్రాళ్లకు కుదేలైపోయారు. అప్పటిదాకా ఎన్నో సినిమాల్లో కన్ను గీటే దృశ్యాలు చూసి ఉంటారు కానీ.. ప్రియ అంత ఎఫెక్టివ్గా ఎవరూ చేసి ఉండరనడంలో సందేహం లేదు.
ఆ వీడియో ఒక్కటే సినిమాకు బోలెడంత ప్రమోషన్ చేసి పెట్టింది. సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో ఆ సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమాలో విషయం లేక బోల్తా కొట్టింది. అయినప్పటికీ ప్రియ మాత్రం ఈ వీడియో వల్ల వచ్చిన పాపులారిటీతో సినిమా, మోడలింగ్ అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో ఆమె చెక్, ఙష్క్ అనే రెండు సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
కాగా తనకు పాపులారిటీ తెచ్చిన వీడియో గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందులో కన్ను గీటే ఐడియా తనదే అని చెప్పడం వివాదాస్పదం అయింది. ఒరు అడార లవ్ దర్శకుడు ఒమర్ లులు వెంటనే లైన్లోకి వచ్చేశాడు. ఈ ఐడియాకు, ప్రియకు సంబంధం లేదని అతను తేల్చేశాడు. ప్రియను పిచ్చి పిల్ల అని సంబోధిస్తూ.. ఐదేళ్ల ముందు జరిగిన విషయం కాబట్టి ప్రియ మరిచిపోయి ఉంటుందని.. ఆమె జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మందులు వాడితే మంచిదని అతను కౌంటర్ వేశాడు.
గతంలో ఒరు అడార్ లవ్ ప్రమోషన్ల సందర్భంగా.. కన్ను గీటే ఐడియా ఆ చిత్రంలో నటించిన రోషన్దే అని ఆమె ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను ఒమర్ లులు షేర్ చేశాడు. రోషన్ కన్నులు ఎగరేయడం చూసి.. దాన్ని ఇంప్రొవైజ్ చేసి అలా కన్ను గీటినట్లు ప్రియ ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. కాగా వింక్ వీడియోను మినహాయిస్తే నటన పరంగా ప్రియలో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో ఆమె కెరీర్ ఊపందుకోలేదు.
This post was last modified on June 8, 2023 9:21 am
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…