Movie News

కమల్, చరణ్ …ఇద్దరికీ ఒక్కడే విలన్

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే శంకర్ కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు. చెరో పది రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తూ రెండు ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నాడు శంకర్. అయితే ఈ రెండు సినిమాలకు కామన్ లింకు ఒకటి ఉంది. దర్శకుడు శంకర్ కాకుండా ఈ రెండు సినిమాలకు వర్క్ చేస్తున్న ఓ నటుడు ఉన్నాడు. అతనే ఎస్ జే సూర్య. 

డైరెక్టర్ కం యాక్టర్ ఎస్ జే సూర్య ‘గేమ్ ఛేంజర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో శ్రీకాంత్ ఒక విలన్ అయినప్పటికీ మరో విలన్ గా సూర్య కనిపిస్తాడట. ఇప్పటికే చరణ్ , సూర్య మీద వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తుంది. తాజాగా ఎస్ జే సూర్య ‘భారతీయుడు 2’ లో మెయిన్ విలన్ అనే న్యూస్ బయటికొచ్చింది. దీంతో శంకర్ తాను తీస్తున్న రెండు భారీ సినిమాళ్లో ఒకే విలన్ ను పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. 

‘స్పైడర్’ లో ఎస్ జే సూర్య తన సైకో విలనిజంతో మెప్పించాడు. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సూర్య కి ఆ సినిమా తెలుగులో పనవ్వలేదు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాళ్లో సూర్య ఎలాంటి వెరీయేషన్ చూపిస్తాడో ? ఎలాంటి విలనిజం పండిస్తాడో మరి.

This post was last modified on June 8, 2023 9:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

42 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago