ఆలూ లేదూ చూలు లేదు సామెత చెప్పినట్టు అసలు ఇంకా స్క్రిప్టే ఫైనల్ కానీ సినిమాల్లో హీరోయిన్ సెలక్షన్ గురించిన వార్తలు భలే విచిత్రంగా ఉంటాయి. ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సంగతి తెలిసిందే. సలార్ రిలీజ్ కాగానే ఇతను తారక్ కి ఫైనల్ వెర్షన్ వినిపించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాడు. అప్పటిదాకా క్యాస్టింగ్ గురించిన ఆలోచనే లేదు. అయినా కూడా ప్రియాంకా చోప్రాని యంగ్ టైగర్ కి జోడిగా తీసుకునే ఆలోచన జరుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని సోషల్ మీడియా పుకార్లు గుప్పుమన్నాయి.
వాస్తవానికి అదేమీ లేదట. నిజానికి ప్రియాంకా చోప్రాని బాలీవుడ్ లోనే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఎవరూ తీసుకోవడం లేదు. ఎంత గ్లామర్ షో చేసినా కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్, అలియా భట్ లాంటి న్యూ జనరేషన్ తో తను సరితూగడం లేదన్నది వాస్తవం. అందుకే ప్రియాంకా చోప్రా సైతం చాలా తెలివిగా హాలీవుడ్ వెబ్ సిరీస్ ల వైపు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వయసు సమస్య కాదు కాబట్టి నాలుగు పదుల ఏజ్ లోనూ సిటాడెల్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతికొచ్చాయి. డాన్ 3ని తీసే ఆలోచనలో ఫర్హాన్ అక్తర్ సైతం ఇప్పుడు ప్రియాంకను వద్దనుకుని కొత్త ఆప్షన్లు చూస్తున్నారు
అలాంటిది జూనియర్ తో జట్టు కట్టించడం కష్టమే. ఏదైనా కీలక పాత్ర అంటే ఓకే కానీ తారక్ ప్రియాంకల జోడి తెరమీద అంతగా ఆనదు. ఎప్పుడో రామ్ చరణ్ తో జంజీర్ చేసినప్పుడు ఓకే కానీ అది వచ్చే దశాబ్దం అయ్యింది. దేవర షూటింగ్ లో బిజీ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ఫారిన్ ట్రిప్ కోసం కొంత బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ ఉండనుంది. హృతిక్ రోషన్ తో చేయబోయే వార్ 2 కోసం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడు. ప్రశాంత్ నీల్ మాత్రం అక్టోబర్ నుంచి తారక్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…