తిరుపతిలో కళ్ళు చెదిరిపోయేలా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలను మించి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ని పబ్లిక్ స్టేజి మీద చూసుకున్న అభిమానులు మురిసిపోయారు. మైకు అందుకున్న డార్లింగ్ ఎక్కువ సేపు మాట్లాడతాడని ఆశించారు. అయితే స్వీట్ అండ్ సింపుల్ గా స్పీచ్ ఇచ్చింది కాసేపే అయినా వాళ్ళు కోరుకున్న ముచ్చట్లయితే చెప్పాడు. పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చి చెప్పే చేసుకుంటానని అది కూడా ఏడుకొండల వాడి సన్నిధిలో జరుపుకుంటామని హామీ ఇచ్చాడు. అయితే అమ్మాయి గురించి చెప్పలేదు లెండి.
తక్కువ మాట్లాడినా ఇకపై ఎక్కువ సినిమాలు ఇస్తానని ఏడాదికి కనీసం రెండు లేదా మూడు కూడా వచ్చే అవకాశాలున్నాయనే సంకేతం ఇచ్చాడు. ఆదిపురుష్ జూన్ 16 వస్తుంది. సలార్ సెప్టెంబర్ 28 ఆల్రెడీ లాక్ చేసుకుంది. అన్నీ సవ్యంగా పూర్తయితే ప్రాజెక్ట్ కె వచ్చే జనవరి 12న దిగుతుంది. అంటే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటలు కాదు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా వేగంగా పరుగులు పెడుతోంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ని యానిమల్ రిలీజ్ తర్వాత మొదలుపెడతారు.
వివాహం సంగతేమో కానీ ప్రభాస్ సినిమాల మీద మాత్రం ఫుల్ కమిట్ మెంట్ తో ఉన్నాడు. ఆదిపురుష్ మీద మొదట్లో వచ్చిన నెగటివ్ వైబ్రేషన్స్ క్రమంగా తగ్గిపోవడంతో ఆ ఆనందం మోహంలో కనిపిస్తోంది. పైగా బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల బిజినెనే నూటా ఎనభై కోట్లకు పైగా జరగడం నేషన్ వైడ్ టాపిక్ అయ్యింది. ఇంకో తొమ్మిది రోజులు ఉన్న నేపథ్యంలో టి సిరీస్ బృందం అటు నార్త్ లోనూ ప్రమోషన్ల వేగం పెంచబోతోంది. ముంబైలో ఈ వారంలోనే ఒక ఈవెంట్ ఉండొచ్చు. సాధ్యం కానీ పక్షంలో ప్రెస్ మీట్లు ఫ్యాన్స్ మీట్లు ప్లాన్ చేస్తారు
This post was last modified on June 7, 2023 2:00 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…