కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లకు హీరోలు బాకీ ఉంటుంటారు. తీసుకున్న రెమ్యునరేషన్ కి సరైన హిట్ పడకపోతే అది బాకీ కిందకే వస్తుంది. రవితేజ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఓ బాకీ ఉన్నాడు. ఆ మధ్య శ్రీను వైట్ల , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబోలో మైత్రి సంస్థ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా నిర్మించింది. ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ రిజల్ట్ తర్వాత రవితేజ మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరితే తప్పకుండా ఓ సినిమా చేస్తానని నిర్మాతలకు మాటిచ్చాడట.
ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కోసం మైత్రి నిర్మాతలు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారట. రీసెంట్ గా తమ బేనర్ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇనసైడ్ న్యూస్. రవితేజతో ‘డాన్ శీను’ తీసి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత మాస్ మహారాజ్ తో ‘బలుపు’ అనే మరో సినిమా తీసి రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.
తాజాగా రవితేజకి గోపీచంద్ ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు రైటింగ్ వర్క్ జరుతుంది. గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరి హీరోలతో బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న మైత్రి సంస్థ రవితేజతో ఈసారైనా సక్సెస్ కొడుతుందా ? చూడాలి.
This post was last modified on June 6, 2023 6:58 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…