కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లకు హీరోలు బాకీ ఉంటుంటారు. తీసుకున్న రెమ్యునరేషన్ కి సరైన హిట్ పడకపోతే అది బాకీ కిందకే వస్తుంది. రవితేజ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఓ బాకీ ఉన్నాడు. ఆ మధ్య శ్రీను వైట్ల , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబోలో మైత్రి సంస్థ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా నిర్మించింది. ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ రిజల్ట్ తర్వాత రవితేజ మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరితే తప్పకుండా ఓ సినిమా చేస్తానని నిర్మాతలకు మాటిచ్చాడట.
ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కోసం మైత్రి నిర్మాతలు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారట. రీసెంట్ గా తమ బేనర్ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇనసైడ్ న్యూస్. రవితేజతో ‘డాన్ శీను’ తీసి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత మాస్ మహారాజ్ తో ‘బలుపు’ అనే మరో సినిమా తీసి రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.
తాజాగా రవితేజకి గోపీచంద్ ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు రైటింగ్ వర్క్ జరుతుంది. గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరి హీరోలతో బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న మైత్రి సంస్థ రవితేజతో ఈసారైనా సక్సెస్ కొడుతుందా ? చూడాలి.
This post was last modified on June 6, 2023 6:58 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…