Movie News

మైత్రి బాకీ తీర్చబోతున్న రవితేజ ?

కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లకు హీరోలు బాకీ ఉంటుంటారు. తీసుకున్న రెమ్యునరేషన్ కి సరైన హిట్ పడకపోతే అది బాకీ కిందకే వస్తుంది. రవితేజ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఓ బాకీ ఉన్నాడు. ఆ మధ్య శ్రీను వైట్ల , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబోలో మైత్రి సంస్థ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా నిర్మించింది. ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ రిజల్ట్ తర్వాత రవితేజ మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరితే తప్పకుండా ఓ సినిమా చేస్తానని నిర్మాతలకు మాటిచ్చాడట.

ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కోసం మైత్రి నిర్మాతలు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారట. రీసెంట్ గా తమ బేనర్ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇనసైడ్ న్యూస్. రవితేజతో ‘డాన్ శీను’ తీసి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత మాస్ మహారాజ్ తో ‘బలుపు’ అనే మరో సినిమా తీసి రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.

తాజాగా రవితేజకి గోపీచంద్ ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు రైటింగ్ వర్క్ జరుతుంది. గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరి హీరోలతో బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న మైత్రి సంస్థ రవితేజతో ఈసారైనా సక్సెస్ కొడుతుందా ? చూడాలి.

This post was last modified on June 6, 2023 6:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

7 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

10 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

10 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

10 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

11 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

12 hours ago