కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లకు హీరోలు బాకీ ఉంటుంటారు. తీసుకున్న రెమ్యునరేషన్ కి సరైన హిట్ పడకపోతే అది బాకీ కిందకే వస్తుంది. రవితేజ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఓ బాకీ ఉన్నాడు. ఆ మధ్య శ్రీను వైట్ల , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబోలో మైత్రి సంస్థ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా నిర్మించింది. ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ రిజల్ట్ తర్వాత రవితేజ మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరితే తప్పకుండా ఓ సినిమా చేస్తానని నిర్మాతలకు మాటిచ్చాడట.
ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కోసం మైత్రి నిర్మాతలు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారట. రీసెంట్ గా తమ బేనర్ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇనసైడ్ న్యూస్. రవితేజతో ‘డాన్ శీను’ తీసి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత మాస్ మహారాజ్ తో ‘బలుపు’ అనే మరో సినిమా తీసి రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.
తాజాగా రవితేజకి గోపీచంద్ ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు రైటింగ్ వర్క్ జరుతుంది. గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరి హీరోలతో బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న మైత్రి సంస్థ రవితేజతో ఈసారైనా సక్సెస్ కొడుతుందా ? చూడాలి.
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…