ఆదిపురుష్ టీం నిన్న చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఇలా చేస్తున్నామని ‘ఆదిపురుస్’ టీం ప్రకటించింది. ఇది వినూత్నమైన, తెలివైన ప్రమోషనల్ ఎత్తుగడ అంటూ చాలామంది కొనియాడుతున్నారు. ఐతే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలా చేయడం కొత్త అయితే కాదు.
తెలుగులోనే కొన్ని సినిమాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్ ప్రయోగాలు చేశారు. 1943లోనే భక్త పోతన సినిమా టీం.. బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇక ‘అన్నమయ్య’ సినిమా ఆడుతున్న థియేటర్లలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టించారు అప్పట్లో. అంతకుముందు ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాకు కూడా ఇలాగే చేశారు. 90వ దశకంలో రిలీజైన ‘అమ్మోరు’ సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ ముందూ మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెడితే.. జనం దాన్నో గుడిలాగా భావించి థియేటర్ల నుంచి బయటికి వచ్చాక మొక్కుకుని వెళ్లడం అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఇదే కోవలో, కొంచెం భిన్నంగా హనుమంతుడి కోసం ఖాళీ సీట్ ఆలోచన చేసింది. ఒకప్పటితో పోలిస్తే జనాలు సినిమాల పట్ల అంత ఎమోషనల్గా లేని ఈ రోజుల్లో ‘ఆదిపురుష్’ టీం ఎత్తుగడ ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చూడాలి మరి. ప్రభాస్, కృతి సనన్ రాముడు-సీతగా కనిపించనున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ రూపొందించాడు. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
This post was last modified on June 6, 2023 2:18 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…