మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బాబీ మరో జాక్ పాట్ కొట్టేశాడు. నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ బాలయ్య పుట్టినరోజు జూన్ 10న రానుంది. గతంలో బాబీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని వార్త వచ్చింది కానీ అదంతా గాలి మాటేనని తర్వాత క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే ఇన్ని నెలలు సైలెంట్ గా ఉన్న బాబీకి బాలయ్య రూపంలో ఒక పవర్ ఫుల్ మాస్ హీరో దొరికితే అంతకన్నా ఏం కావాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ కాంబోలో మూవీ గురించి గతంలో ఆన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు పరస్పరం హింట్ ఇచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ ఎవరన్నది లాక్ చేయలేదు. బాబీ కూడా తొందరపడకుండా సరైన హీరో దొరకాలనే ఉద్దేశంతో మౌనంగా తన పని తాను చేసుకోవడం సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం భగవత్ కేసరి షూటింగ్ తో బిజీగా ఉన్న బాలయ్య ఇది పూర్తయ్యాక చేసే ఎన్బికె 109 బాబీదే అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది రూపొందనుంది.
ఈ లెక్కన ఆదిత్య 369 సీక్వెల్ తో పాటు పూరి జగన్నాధ్ తో బాలయ్య చేయాల్సిన సినిమాలు ఇంకా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. సితార సంస్థ కాబట్టి ఎలాగూ కథ విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది. బాబీకి ఎంత అనుభవమున్నా గురూజీ సలహాలు ఉపయోగపడతాయి. సంగీత దర్శకుడిగా తిరిగి తమన్ మళ్ళీ రిపీట్ అవుతాడా లేక బాబీ రెగ్యులర్ ఫేవరెట్ దేవిశ్రీ ప్రసాద్ వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. షూటింగ్ గట్రా మొదలవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 2024 సమ్మర్ ని విడుదలకు లక్ష్యంగా పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు ఇంకో అయిదు రోజుల్లో వచ్చేస్తాయి
This post was last modified on June 5, 2023 5:49 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…