భారీ బడ్జెట్ పెట్టి ఎంతో రిస్క్ చేసి తీసిన ఓ పెద్ద సినిమా వస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర కూడా అనుకూల పరిస్థితులు నెలకొనడం కీలకం. ఆ విషయంలో ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’కు భలేగా కలిసొస్తోందనే చెప్పాలి. ముందు అనుకున్నట్లు సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏమై ఉండేదో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
వేసవిలో ఏ పెద్ద సినిమా లేక ప్రేక్షకులు కరవులో ఉన్నారు. దీనికి తోడు ‘ఆదిపురుష్’ రావడానికి ముందు కొన్ని వారాల పాటు బాక్సాఫీస్లో స్తబ్దత కనిపిస్తోంది. ఏ సినిమా కూడా థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షించలేకపోతోంది. ‘ఆదిపురుష్’ రిలీజ్కు వారం ముందు వస్తున్న టక్కర్, విమానం సినిమాల మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. ప్రేక్షకుల దృష్టంతా ‘ఆదిపురుష్’ మీదే కేంద్రీకృతం అయి ఉంది.
‘ఆదిపురుష్’ విడుదలయ్యే వీకెండ్లో తెలుగులోనే కాక వేరే భాషల్లో కూడా చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. తర్వాతి వారం కూడా పోటీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నెలాఖర్లో నిఖిల్ సినిమా ‘స్పై’ ఓ మోస్తరు అంచనాలతో రాబోతోంది. ‘ఆదిపురుష్’ అప్పటి వరకు నిలబడితే కలెక్షన్లు చాలా పెద్ద రేంజికే వెళ్లిపోతాయి. మొత్తంగా చూస్తే ప్రేక్షకుల మూడ్, బాక్సాఫీస్ పరిస్థితులు ‘ఆదిపురుష్’కు పూర్తి అనుకూలంగా ఉన్నాయన్నది స్పష్టం.
ఇక ఔట్ పుట్ ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇంకొక్క రోజులోనే ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతి వేదికగా భారీగా చేయబోతున్నారు. అప్పుడే రిలీజ్ ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్తో సినిమాకు మరింత హైప్ పెంచితే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి. రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులతోనే ఆ మేర బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 5, 2023 7:43 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…