విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికి భోళా శంకర్ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఇవాళ మొదటి ఆడియో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ ఆల్బమ్ మీద ప్రత్యేక అంచనాలున్నాయి. కారణం స్వరబ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ తొలిసారి మెగాస్టార్ కు ట్యూన్స్ కంపోజ్ చేశాడు. తండ్రికి ఈ కాంబోలో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఉన్నాయి. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇద్దరు మిత్రులు, అంజి లాంటివి ఫెయిలైనా సాంగ్స్ మాత్రం సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ హైప్.
ఇక పాట విషయానికి ఇది భోళా శంకర్ టైటిల్ సాంగ్. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ప్రారంభంలోనే వస్తుంది. రామజోగయ్య శాస్త్రి క్యాచీ పదాలతో సమకూర్చిన సాహిత్యానికి రేవంత్ గాత్రం అందించారు. మొత్తం ఇంటీరియర్ లోనే షూట్ చేశారు. విజువల్స్ గట్రా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ట్యూన్ పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుంది. భోళా మేనియా అంటూ ఒక సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వినగా వినగా మెల్లగా కనెక్ట్ అయ్యేలా ఉంది. వాల్తేరు వీరయ్య విషయంలోనూ బాస్ పార్టీ మీద మొదట నెగటివిటీ వచ్చి ఆ తర్వాత ఆ పాటే టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే
దీనికే మహతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పలేం. డీసెంట్ మార్కులు వచ్చాయంతే. ఇంకా అసలు బాధ్యత చాలా ఉంది. అసలే వేదాళం రీమేక్ గా ఫ్యాన్స్ లో దీని మీద కొంత ప్రతికూలత ఉంది. దానికన్నా ఎక్కువ మెహర్ రమేష్ దర్శకత్వానికి టెన్షన్ పడుతున్నారు. వీటికి సమాధానం దొరకాలంటే దానికి మొదటి మెట్టు సంగీతమే అవ్వాలి. అసలే మహతికి ఛలో తర్వాత ఒక్క బెస్ట్ ఆల్బమ్ పడలేదు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే స్టార్ హీరోల నుంచి పిలుపులు వస్తాయి. తమన్, దేవిల తర్వాత మిగిలిపోయిన గ్యాప్ వాడుకుని త్వరగా ఎదగొచ్చు
This post was last modified on June 4, 2023 4:45 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…