మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసేసుకున్నాడు. కొన్ని నెలల ముందు వరకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనట్లు కనిపించిన రానా.. ఉన్నట్లుండి మిహీకా బజాజ్తో ఎంగేజ్ అయినట్లు ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా ఆలస్యం చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది. దగ్గుబాటి వారి ఇంట చాన్నాళ్లకు జరిగిన పెళ్లి ఇది. చాలా ఘనంగానే జరుపుకోవాలి. కానీ కరోనా ముప్పు నేపథ్యంలో మామూలు రోజుల్లో మాదిరి హడావుడి చేసే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కాకుండా ఇండస్ట్రీ నుంచి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కానీ ఆ జాబితాలో ఓ పెద్ద కుటుంబం నుంచి ఎవ్వరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
టాలీవుడ్లో పెద్ద కుటుంబాలు అంటే.. మెగా, దగ్గుబాటి, అక్కినేని, నందమూరిలవే. పెళ్లి జరిగింది దగ్గుబాటి వారి ఇంట కాబట్టి.. మిగతా మూడు పెద్ద కుటుంబాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ప్రతినిధులుండాలి. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లిలో పాల్గొన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సమంత వచ్చారు. వాళ్లు కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులే ఒక రకంగా.
ఇక మిగిలింది నందమూరి ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ పెళ్లికి రాలేదు. నందమూరి బాలకృష్ణ కుటుంబాన్ని అసలు ఆహ్వానించారా లేదా అన్నది సందేహం. కనీసం తన మిత్రుడే అయిన జూనియర్ ఎన్టీఆర్ను కూడా రానా పిలవలేదా.. లేక బాలయ్యను పిలవకుండా తారక్ను పిలిచి అతను హాజరైతే బాగోదని ఆగిపోయాడా అన్నది తెలియదు. కరోనా పేరుతో కవర్ చేసేయొచ్చు కానీ.. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరైనా ఈ పెళ్లిలో పాల్గొని ఉంటే నిండుతనం వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 10, 2020 11:43 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…