మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసేసుకున్నాడు. కొన్ని నెలల ముందు వరకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనట్లు కనిపించిన రానా.. ఉన్నట్లుండి మిహీకా బజాజ్తో ఎంగేజ్ అయినట్లు ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా ఆలస్యం చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది. దగ్గుబాటి వారి ఇంట చాన్నాళ్లకు జరిగిన పెళ్లి ఇది. చాలా ఘనంగానే జరుపుకోవాలి. కానీ కరోనా ముప్పు నేపథ్యంలో మామూలు రోజుల్లో మాదిరి హడావుడి చేసే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కాకుండా ఇండస్ట్రీ నుంచి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కానీ ఆ జాబితాలో ఓ పెద్ద కుటుంబం నుంచి ఎవ్వరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
టాలీవుడ్లో పెద్ద కుటుంబాలు అంటే.. మెగా, దగ్గుబాటి, అక్కినేని, నందమూరిలవే. పెళ్లి జరిగింది దగ్గుబాటి వారి ఇంట కాబట్టి.. మిగతా మూడు పెద్ద కుటుంబాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ప్రతినిధులుండాలి. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లిలో పాల్గొన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సమంత వచ్చారు. వాళ్లు కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులే ఒక రకంగా.
ఇక మిగిలింది నందమూరి ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ పెళ్లికి రాలేదు. నందమూరి బాలకృష్ణ కుటుంబాన్ని అసలు ఆహ్వానించారా లేదా అన్నది సందేహం. కనీసం తన మిత్రుడే అయిన జూనియర్ ఎన్టీఆర్ను కూడా రానా పిలవలేదా.. లేక బాలయ్యను పిలవకుండా తారక్ను పిలిచి అతను హాజరైతే బాగోదని ఆగిపోయాడా అన్నది తెలియదు. కరోనా పేరుతో కవర్ చేసేయొచ్చు కానీ.. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరైనా ఈ పెళ్లిలో పాల్గొని ఉంటే నిండుతనం వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 10, 2020 11:43 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…