తెలుగమ్మాయే అయిన షకీలా.. మలయాళ ఫిలిం ఇండస్ట్రీని ఒకప్పుడు ఎలా షేక్ చేసిందో 2000 సంవత్సరానికి అటు ఇటు యవ్వనంలో ఉన్న వాళ్లకు బాగానే తెలిసి ఉంటుంది. షకీలా నటించే సాఫ్ట్ పోర్న్ సినిమాల కారణంగా తమ చిత్రాల వసూళ్లు దెబ్బ తింటుండటంతో ఆమె సినిమాలపై నిషేధం విధించాలని మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని కోరే వరకు పరిస్థితి వెళ్లింది అప్పట్లో.
దర్శకుడు తేజ సైతం ఇటీవల ‘అహింస’ ఈవెంట్లో షకీలా నటించిన ఓ సినిమాకు హైదరాబాద్లో తారకరామ థియేటర్ ముందు నెలకొన్న హంగామా గురించి చెప్పారు. దీన్ని బట్టే అప్పట్లో షకీలా క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలానే స్వయంగా తనకు అప్పట్లో ఉన్న డిమాండ్ గురించి వివరించింది. తాను అప్పట్లోనే రోజుకు రూ.4 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
తాను అప్పట్లో భారీగా ఆస్తులు కూడా కొన్నానని.. కానీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే మోసపోయి ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నానని షకీలా తెలిపింది. తాను ఇప్పటికీ బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.
‘‘నేను అప్పట్లో రోజుకు రూ.4 లక్షలు పారితోషకం తీసుకునేదాన్ని. చాలా ఆస్తులు కూడా సంపాదించాను. కానీ ఐటీ వాళ్లు రైడ్ చేస్తారని భయపెట్టి.. నా ఆస్తులన్నీ నా సోదరి రాయించుకుంది. కానీ తర్వాత ఆమె నన్ను మోసం చేసి ఆ ఆస్తులన్నీ కాజేసింది. ఇప్పుడు నా దగ్గర ఏ ఆస్తులూ లేవు. నిజానికి సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె కొంపలో ఉంటున్నా’’ అని షకీలా తెలిపింది. తేజ ‘జయం’ సినిమాతో సాధారణ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన షకీలా.. తర్వాత ఇలాంటి చిన్నా చితకా పాత్రలే చాలా చేసింది. ఇప్పుడు ఆ ఛాన్సులూ లేక ఏవో టీవీ షోల్లో కనిపిస్తోంది.
This post was last modified on June 4, 2023 1:21 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…