Movie News

ఆదిపురుష్ సంగీత దర్శకుడి బైక్ సాహసం

ఒక్కోసారి భక్తి సినిమాకు పని చేశామన్న భావన ఆయా నటీనటుల్లో సాంకేతిక నిపుణుల్లో అపారమైన దైవ చింతన తీసుకొస్తుంది. ఆదిపురుష్ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన అతుల్ ఏకంగా ముంబై  నుంచి తిరుపతికి బైకు యాత్ర చేయబోతున్నాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం అక్షరాలా 1230 కిలోమీటర్లు. ఫ్లైట్ లో వెళ్తేనే కనీసం రెండు గంటల టైం పడుతుంది. అలాంటిది ప్రమాదాలు పొంచి ఉండే హైవే మీద కేవలం మూడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం చిన్న విషయం కాదు. మూడున బయలుదేరి అయిదుకి తిరుపతి చేరుకుని ఆరో తేదీ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతుల్ పాల్గొనబోతున్నాడు.

అజయ్ తో కలిసి జై శ్రీరామ్ పాట లైవ్ పెర్ఫార్మన్స్ ని లక్షలాది ప్రేక్షకుల ముందు ఇవ్వబోతున్నారు. ఇది తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కష్టపడి పనిచేసినా మరీ ఇంత రిస్క్ తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో వంద కిలోమీటర్లంటే ఓకే కానీ మరీ సహస్రం అంటే మాములు సాహసం కాదు. ఏడుకొండల వాడి పాదాల దగ్గర ఆదిపురుష్ ఈవెంట్ తాలూకు పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. పాస్ లు సిద్ధం చేసి జిల్లాల వారి అభిమాన సంఘాలకు పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక అభిమాన బృందం బయలుదేరబోతోంది

ఇంకో పదమూడు రోజుల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆదిపురుష్ కు సంబంధించిన ఏ వార్తయినా సరే హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ట్రైలర్, రెండు పాటలకు దక్కిన రెస్పాన్స్ చూసి టి సిరీస్ సంస్థ హుషారుగా ఉంది. ఈవెంట్ రోజున రెండున్నర నిమిషాల మరో స్పెషల్ ట్రైలర్ ని వదలబోతున్నారు. ఇందులో కేవలం యుద్ధాలు, యాక్షన్ సన్నివేశాలతో కూడిన విజువల్స్ ఉంటాయట. ఇది చూశాక హైప్ ని పట్టుకోవడం కష్టమేనని ఇన్ సైడ్ టాక్. ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే వారం నుంచే ఆన్ లైన్ సేల్స్ మొదలవుతాయి 

This post was last modified on June 3, 2023 7:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్…

30 minutes ago

ముక్కుసూటిగా పోతే.. రఘురామకే ఇబ్బంది.. !

రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు…

34 minutes ago

బలవంత్ మీద ఫోకస్ పెరుగుతోంది

ఇది సోషల్ మీడియా కాలం. చిన్న సినిమాలకు మార్కెటింగ్ ప్రాణ సంకటంగా మారిపోయింది. చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక…

1 hour ago

శవమై తేలిన మనపల్లి అత్యాచార నిందితుడు

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా…

2 hours ago

రామ్ ఫలితమే సంతోష్ శోభన్ చూస్తాడా

గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…

7 hours ago

‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి

వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్‌ను హీరీగా…

8 hours ago