Movie News

అది నా ఇల్లు.. రమాప్రభ ఖండన

దివంగత నటుడు శరత్ బాబుతో లెజెండరీ నటి రమాప్రభ ఒకప్పుడు భార్య భర్తలన్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం కొనసాగింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐతే శరత్ బాబును హీరోగా నిలబెట్టడానికి కొన్ని సినిమాలు నిర్మించడమే కాక.. తన మీద ప్రేమతో ఆస్తులన్నింటినీ కూడా ఆయనకు ధారాదత్తం చేసినట్లు రమాప్రభ తరచుగా ఆవేదన చేస్తుంటారు. కానీ శరత్ బాబు ఆ ఆరోపణలను ఖండిస్తూ రమాప్రభనే తనను మోసం చేసినట్లు చెప్పేవారు.

కాగా ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా చెన్నైలో ఉన్న ఓ ఇంటి గురించి మీడియాలో వస్తున్న వార్తల మీద రమాప్రభ అసహనం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తన సొంతం అని.. అది శరత్ బాబుది కాదు అని ఆమె ఆయన పేరెత్తకుండా వ్యాఖ్యానించారు. తాను నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్లో ఆమె ఈ విషయం వెల్లడించారు.

చెన్నైలో తనకో ఇల్లు ఉందని.. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారని.. కానీ అది రమాప్రభ ఇల్లు అనే విషయం ఎవరూ చెప్పడం లేదని రమాప్రభ ఆవేదన వ్యక్తం చేశారు. అది తన ఇల్లు కాదు.. వేరే వాళ్ల ఇల్లు అని మీడియాలో చెబుతుండటం.. అది విని తనకు నవ్వొస్తోందని రమాప్రభ అన్నారు.

తనకు రజినీకాంత్ డబ్బులు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు చూశానని.. కానీ తాను 13 ఏళ్ల చిన్న వయసు నుంచే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టానని.. కానీ ఇప్పుడు తన గురించి చాలామంది ఏది పడితే అది మాట్లాడుతూ సంపాదిస్తున్నారని రమాప్రభ ఆవేదన చెందారు. శరత్ బాబు మరణం, ఈ నేపథ్యంలో మాజీ భార్యగా తన గురించి వస్తున్న వార్తలపై రమాప్రభ స్పందిస్తూ.. “కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఒక్కోసారి బాధ కలుగుతుంది. ఏదో రకంగా నేను పాపులర్ అవుతున్నా” అని పేర్కొన్నారు.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

59 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago