దివంగత నటుడు శరత్ బాబుతో లెజెండరీ నటి రమాప్రభ ఒకప్పుడు భార్య భర్తలన్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం కొనసాగింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐతే శరత్ బాబును హీరోగా నిలబెట్టడానికి కొన్ని సినిమాలు నిర్మించడమే కాక.. తన మీద ప్రేమతో ఆస్తులన్నింటినీ కూడా ఆయనకు ధారాదత్తం చేసినట్లు రమాప్రభ తరచుగా ఆవేదన చేస్తుంటారు. కానీ శరత్ బాబు ఆ ఆరోపణలను ఖండిస్తూ రమాప్రభనే తనను మోసం చేసినట్లు చెప్పేవారు.
కాగా ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా చెన్నైలో ఉన్న ఓ ఇంటి గురించి మీడియాలో వస్తున్న వార్తల మీద రమాప్రభ అసహనం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తన సొంతం అని.. అది శరత్ బాబుది కాదు అని ఆమె ఆయన పేరెత్తకుండా వ్యాఖ్యానించారు. తాను నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్లో ఆమె ఈ విషయం వెల్లడించారు.
చెన్నైలో తనకో ఇల్లు ఉందని.. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారని.. కానీ అది రమాప్రభ ఇల్లు అనే విషయం ఎవరూ చెప్పడం లేదని రమాప్రభ ఆవేదన వ్యక్తం చేశారు. అది తన ఇల్లు కాదు.. వేరే వాళ్ల ఇల్లు అని మీడియాలో చెబుతుండటం.. అది విని తనకు నవ్వొస్తోందని రమాప్రభ అన్నారు.
తనకు రజినీకాంత్ డబ్బులు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు చూశానని.. కానీ తాను 13 ఏళ్ల చిన్న వయసు నుంచే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టానని.. కానీ ఇప్పుడు తన గురించి చాలామంది ఏది పడితే అది మాట్లాడుతూ సంపాదిస్తున్నారని రమాప్రభ ఆవేదన చెందారు. శరత్ బాబు మరణం, ఈ నేపథ్యంలో మాజీ భార్యగా తన గురించి వస్తున్న వార్తలపై రమాప్రభ స్పందిస్తూ.. “కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఒక్కోసారి బాధ కలుగుతుంది. ఏదో రకంగా నేను పాపులర్ అవుతున్నా” అని పేర్కొన్నారు.
This post was last modified on June 3, 2023 4:12 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…