లెజెండరీ స్టార్ హీరోల చివరి సినిమాలు చిరస్మరణీయం కావాలని కోరుకుంటారు కానీ ఒక్కోసారి అనూహ్యంగా ఇవి కొత్త మలుపులు తీసుకుంటాయి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం మనం. అయితే నలభై ఏళ్ళు ల్యాబ్ లో మగ్గిపోయిన ప్రతిబింబాలు లాస్ట్ మూవీ అయ్యింది. థియేట్రికల్ రిలీజ్ నే కౌంట్ గా తీసుకుంటారు కనక అలా మనం ఆ ల్యాండ్ మార్క్ ని మిస్ అయ్యింది. స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ హిందీ వెర్షన్ ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. శోభన్ బాబు, కృష్ణంరాజుగార్ల ఫిల్మోగ్రఫీ డిజాస్టర్లతోనే ముగిసింది.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. ఆయన ఆఖరిగా తెరమీద కనిపించిన సినిమా శ్రీశ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాన్స్ కి గుర్తే. నరేష్, విజయనిర్మల కీలక పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడిది లాస్ట్ కాదు. ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చివరిది కానుందని దాని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇది ఎప్పుడో 2007లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రకరకాల కారణాల వల్ల ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. శాండల్ వుడ్ లో పేరున్న హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించారు. ఇన్నేళ్లు బయటికి తీసుకొచ్చే చొరవ ఎవరూ చేయలేదు.
కృష్ణగారు వెళ్ళిపోయాక ఇప్పుడు దీనికి మోక్షం తీసుకురానున్నారు. పోస్టర్ గట్రా చూస్తుంటే బాగా తక్కువ బడ్జెట్ లో తీసినట్టు కనిపిస్తోంది. బిజినెస్ జరగని కారణంగా ఆపేశారో లేక నిర్మాత చేతులు ఎత్తేశారో ఏదైతేనేం ఇలాంటివి చివరి జ్ఞాపకాలుగా ఉండటం ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరు. నిజంగా కంటెంట్ అంత బాగుంటే ఎప్పుడో వచ్చేదిగా. పదిహేడేళ్లు వేచి చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. నాలుగు వందల సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోలేకపోయిన కృష్ణ ఎవరూ అందుకోలేని మైలురాళ్లు టాలీవుడ్ లో పాతేసి వెళ్లారనేది నిజం.
This post was last modified on June 3, 2023 1:38 pm
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…