లెజెండరీ స్టార్ హీరోల చివరి సినిమాలు చిరస్మరణీయం కావాలని కోరుకుంటారు కానీ ఒక్కోసారి అనూహ్యంగా ఇవి కొత్త మలుపులు తీసుకుంటాయి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం మనం. అయితే నలభై ఏళ్ళు ల్యాబ్ లో మగ్గిపోయిన ప్రతిబింబాలు లాస్ట్ మూవీ అయ్యింది. థియేట్రికల్ రిలీజ్ నే కౌంట్ గా తీసుకుంటారు కనక అలా మనం ఆ ల్యాండ్ మార్క్ ని మిస్ అయ్యింది. స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ హిందీ వెర్షన్ ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. శోభన్ బాబు, కృష్ణంరాజుగార్ల ఫిల్మోగ్రఫీ డిజాస్టర్లతోనే ముగిసింది.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. ఆయన ఆఖరిగా తెరమీద కనిపించిన సినిమా శ్రీశ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాన్స్ కి గుర్తే. నరేష్, విజయనిర్మల కీలక పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడిది లాస్ట్ కాదు. ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చివరిది కానుందని దాని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇది ఎప్పుడో 2007లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రకరకాల కారణాల వల్ల ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. శాండల్ వుడ్ లో పేరున్న హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించారు. ఇన్నేళ్లు బయటికి తీసుకొచ్చే చొరవ ఎవరూ చేయలేదు.
కృష్ణగారు వెళ్ళిపోయాక ఇప్పుడు దీనికి మోక్షం తీసుకురానున్నారు. పోస్టర్ గట్రా చూస్తుంటే బాగా తక్కువ బడ్జెట్ లో తీసినట్టు కనిపిస్తోంది. బిజినెస్ జరగని కారణంగా ఆపేశారో లేక నిర్మాత చేతులు ఎత్తేశారో ఏదైతేనేం ఇలాంటివి చివరి జ్ఞాపకాలుగా ఉండటం ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరు. నిజంగా కంటెంట్ అంత బాగుంటే ఎప్పుడో వచ్చేదిగా. పదిహేడేళ్లు వేచి చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. నాలుగు వందల సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోలేకపోయిన కృష్ణ ఎవరూ అందుకోలేని మైలురాళ్లు టాలీవుడ్ లో పాతేసి వెళ్లారనేది నిజం.
This post was last modified on June 3, 2023 1:38 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…