ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, డివిడిలకు పరిమితమైన పైరసీ ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకుని డిజిటల్ కు షిఫ్ట్ అయిపోయింది. మరింత చవకగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా జనాలకు అందుబాటులో ఉంటోంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే వేల కోట్లతో సినిమాలు తీసే హాలీవుడ్ నిర్మాతలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం చట్టానికి సైతం సవాల్ గా నిలిచి పోలీసులు ఒకదశ దాటి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ బెడద ఓటిటిలకూ అంటుకుని ముచ్చెమటలు పట్టిస్తోంది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో అసుర్ ఒకటి. మున్నాభాయ్ లో ఏటీఎంగా నటించిన అర్షద్ వార్సీ ప్రధాన పాత్ర పోషించారు. పురాణాల్లోని కర్మ సిద్ధాంతానికి హింసను ముడిపెట్టి తీసిన వెరైటీ సైకో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ కి బ్రహాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రెండో భాగాన్ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేశారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తామని ఆ మేరకు ఒక్కొకటి వదలడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్న జియో టీమ్ వెంటనే అన్నీ రిలీజ్ చేసింది
అసలు అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాక జియో బృందం తలలు పట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం కొందరు రివ్యూయర్లకు ప్రత్యేకంగా అసుర్ 2 మొత్తాన్ని ఆన్ లైన్ లో స్క్రీన్ చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ బయటికి వచ్చిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లలో డేటా లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వచ్చాయంటే పైరసీ టీమ్ సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత అడ్వాన్స్ అవుతున్న వాళ్ళను కట్టడి చేయడం భవిష్యత్తులో అయినా దుర్లభమే అనిపిస్తుంది
This post was last modified on June 3, 2023 10:03 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…