ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, డివిడిలకు పరిమితమైన పైరసీ ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకుని డిజిటల్ కు షిఫ్ట్ అయిపోయింది. మరింత చవకగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా జనాలకు అందుబాటులో ఉంటోంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే వేల కోట్లతో సినిమాలు తీసే హాలీవుడ్ నిర్మాతలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం చట్టానికి సైతం సవాల్ గా నిలిచి పోలీసులు ఒకదశ దాటి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ బెడద ఓటిటిలకూ అంటుకుని ముచ్చెమటలు పట్టిస్తోంది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో అసుర్ ఒకటి. మున్నాభాయ్ లో ఏటీఎంగా నటించిన అర్షద్ వార్సీ ప్రధాన పాత్ర పోషించారు. పురాణాల్లోని కర్మ సిద్ధాంతానికి హింసను ముడిపెట్టి తీసిన వెరైటీ సైకో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ కి బ్రహాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రెండో భాగాన్ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేశారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తామని ఆ మేరకు ఒక్కొకటి వదలడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్న జియో టీమ్ వెంటనే అన్నీ రిలీజ్ చేసింది
అసలు అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాక జియో బృందం తలలు పట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం కొందరు రివ్యూయర్లకు ప్రత్యేకంగా అసుర్ 2 మొత్తాన్ని ఆన్ లైన్ లో స్క్రీన్ చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ బయటికి వచ్చిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లలో డేటా లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వచ్చాయంటే పైరసీ టీమ్ సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత అడ్వాన్స్ అవుతున్న వాళ్ళను కట్టడి చేయడం భవిష్యత్తులో అయినా దుర్లభమే అనిపిస్తుంది
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…