ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, డివిడిలకు పరిమితమైన పైరసీ ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకుని డిజిటల్ కు షిఫ్ట్ అయిపోయింది. మరింత చవకగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా జనాలకు అందుబాటులో ఉంటోంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే వేల కోట్లతో సినిమాలు తీసే హాలీవుడ్ నిర్మాతలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం చట్టానికి సైతం సవాల్ గా నిలిచి పోలీసులు ఒకదశ దాటి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ బెడద ఓటిటిలకూ అంటుకుని ముచ్చెమటలు పట్టిస్తోంది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో అసుర్ ఒకటి. మున్నాభాయ్ లో ఏటీఎంగా నటించిన అర్షద్ వార్సీ ప్రధాన పాత్ర పోషించారు. పురాణాల్లోని కర్మ సిద్ధాంతానికి హింసను ముడిపెట్టి తీసిన వెరైటీ సైకో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ కి బ్రహాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రెండో భాగాన్ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేశారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తామని ఆ మేరకు ఒక్కొకటి వదలడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్న జియో టీమ్ వెంటనే అన్నీ రిలీజ్ చేసింది
అసలు అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాక జియో బృందం తలలు పట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం కొందరు రివ్యూయర్లకు ప్రత్యేకంగా అసుర్ 2 మొత్తాన్ని ఆన్ లైన్ లో స్క్రీన్ చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ బయటికి వచ్చిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లలో డేటా లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వచ్చాయంటే పైరసీ టీమ్ సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత అడ్వాన్స్ అవుతున్న వాళ్ళను కట్టడి చేయడం భవిష్యత్తులో అయినా దుర్లభమే అనిపిస్తుంది
This post was last modified on June 3, 2023 10:03 am
ఈ రోజుల్లో కూడా పిల్లలు అనారోగ్యం పాలైతే మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి తాయిత్తులు కట్టించడం.. చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించడం లాంటివి చేసే…
ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండని ఎగుడుదిగుడుల ఎత్తయిన రోడ్డుని ఘాట్ సెక్షన్ గా పిలుస్తాం. విశ్వంభర జర్నీ అచ్చం ఇలాగే…
గొప్ప పొటెన్షియల్ ఉన్న సినిమాను తీసి బాగా ప్రమోట్ చేసుకోవడమే కాదు దాన్ని రిలీజ్ పరంగా పక్కా ప్లానింగ్ తో…
తెలుగులో అత్యంత డిమాండ్ ఉండే పండుగ సీజన్ అంటే.. సంక్రాంతే. ఆ టైంలో రిలీజయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల…
తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ తరహా పరిస్థితి…
ఐపీఎల్ 2025లో సరికొత్త సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నుంచి భారీ గిఫ్ట్ లభించింది.…