Movie News

జియోకు షాకిచ్చిన టెలిగ్రామ్ పైరసీ

ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, డివిడిలకు పరిమితమైన పైరసీ ఇప్పుడు  పూర్తిగా రూపం మార్చుకుని డిజిటల్ కు షిఫ్ట్ అయిపోయింది. మరింత  చవకగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా జనాలకు అందుబాటులో ఉంటోంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే వేల కోట్లతో సినిమాలు తీసే హాలీవుడ్ నిర్మాతలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం చట్టానికి సైతం సవాల్ గా నిలిచి పోలీసులు ఒకదశ దాటి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ బెడద ఓటిటిలకూ అంటుకుని ముచ్చెమటలు పట్టిస్తోంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో అసుర్ ఒకటి. మున్నాభాయ్ లో ఏటీఎంగా నటించిన అర్షద్ వార్సీ ప్రధాన పాత్ర పోషించారు. పురాణాల్లోని కర్మ సిద్ధాంతానికి హింసను ముడిపెట్టి తీసిన వెరైటీ సైకో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ కి బ్రహాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రెండో భాగాన్ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేశారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తామని ఆ మేరకు ఒక్కొకటి  వదలడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్న జియో టీమ్ వెంటనే అన్నీ రిలీజ్ చేసింది

అసలు అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాక జియో బృందం తలలు పట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం కొందరు రివ్యూయర్లకు ప్రత్యేకంగా అసుర్ 2 మొత్తాన్ని ఆన్ లైన్ లో స్క్రీన్ చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ బయటికి వచ్చిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లలో డేటా లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వచ్చాయంటే పైరసీ టీమ్ సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత అడ్వాన్స్ అవుతున్న వాళ్ళను కట్టడి చేయడం భవిష్యత్తులో అయినా దుర్లభమే అనిపిస్తుంది 

This post was last modified on June 3, 2023 10:03 am

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago