ఏడాది కాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్ల హంగామా నడుస్తోంది. ఐతే పోకిరి, జల్సా లాంటి సినిమాలను మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే ఎంజాయ్ చేశారు కానీ.. రీ రిలీజ్ల్లో కూడా రికార్డుల గొడవలు మొదలవడంతో ఇదొక ప్రహసనం లాగా తయారైంది ఒక దశ తర్వాత. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.. ఎన్ని షోలు వేస్తున్నారు.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. వసూళ్లు ఎన్ని వచ్చాయి.. థియేటర్లలో సంబరాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాల్లో కూడా లెక్కలేసుకోవడం మొదలై ఈ రీ రిలీజ్ల వ్యవహారమే పక్కదారి పడుతున్ సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి టైంలో ఒక క్లాసిక్ మూవీ ఈ గొడవలేమీ లేకుండా అభిమానులకు మరపురాని అనుభూతిని ఇస్తోంది. ఆ చిత్రమే.. మోసగాళ్ళకు మోసగాడు. సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.
ఈ సినిమా స్పెషల్ షోలను కృష్ణ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదిరిపోయే ప్రింట్ రెడీ చేసింది. అలాగే రిలీజ్కు మంచి ఏర్పాట్లు చేసింది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఇక దశాబ్దాల నుంచి స్తబ్దుగా ఉన్న కృష్ణ అభిమానులు.. ఈ తరం ఫ్యాన్స్ లాగా అనవసర హంగామా చేయకుండా ఈ క్లాసిక్ బ్లాక్బస్టర్ను మళ్లీ థియేటర్లలో చూసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. థియేటర్లలో గోల.. వసూళ్ల గొడవ.. ఇవేమీ లేకుండా సైలెంటుగా సినిమాను ఎంజాయ్ చేశారు.
ఇప్పటికీ ట్రెండీగా అనిపించేలా సినిమా ఉండటం.. ప్రింట్ అదిరిపోవడం.. కృష్ణను ఎన్నో ఏళ్ల తర్వాత వెండి తెరపై చూడటం వారికి మరపురాని అనుభూతిని ఇస్తోంది. రీ రిలీజ్ అంటే ఇలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా ఉండాలే తప్ప.. రికార్డుల గొడవలు.. అవసరం లేని హంగామాలు ఎందుకు అనే అభిప్రాయాలు సినీ ప్రియుల్లో వ్యక్తమవుతున్నాయి.
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…