ఏడాది కాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్ల హంగామా నడుస్తోంది. ఐతే పోకిరి, జల్సా లాంటి సినిమాలను మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే ఎంజాయ్ చేశారు కానీ.. రీ రిలీజ్ల్లో కూడా రికార్డుల గొడవలు మొదలవడంతో ఇదొక ప్రహసనం లాగా తయారైంది ఒక దశ తర్వాత. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.. ఎన్ని షోలు వేస్తున్నారు.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. వసూళ్లు ఎన్ని వచ్చాయి.. థియేటర్లలో సంబరాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాల్లో కూడా లెక్కలేసుకోవడం మొదలై ఈ రీ రిలీజ్ల వ్యవహారమే పక్కదారి పడుతున్ సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి టైంలో ఒక క్లాసిక్ మూవీ ఈ గొడవలేమీ లేకుండా అభిమానులకు మరపురాని అనుభూతిని ఇస్తోంది. ఆ చిత్రమే.. మోసగాళ్ళకు మోసగాడు. సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.
ఈ సినిమా స్పెషల్ షోలను కృష్ణ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదిరిపోయే ప్రింట్ రెడీ చేసింది. అలాగే రిలీజ్కు మంచి ఏర్పాట్లు చేసింది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఇక దశాబ్దాల నుంచి స్తబ్దుగా ఉన్న కృష్ణ అభిమానులు.. ఈ తరం ఫ్యాన్స్ లాగా అనవసర హంగామా చేయకుండా ఈ క్లాసిక్ బ్లాక్బస్టర్ను మళ్లీ థియేటర్లలో చూసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. థియేటర్లలో గోల.. వసూళ్ల గొడవ.. ఇవేమీ లేకుండా సైలెంటుగా సినిమాను ఎంజాయ్ చేశారు.
ఇప్పటికీ ట్రెండీగా అనిపించేలా సినిమా ఉండటం.. ప్రింట్ అదిరిపోవడం.. కృష్ణను ఎన్నో ఏళ్ల తర్వాత వెండి తెరపై చూడటం వారికి మరపురాని అనుభూతిని ఇస్తోంది. రీ రిలీజ్ అంటే ఇలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా ఉండాలే తప్ప.. రికార్డుల గొడవలు.. అవసరం లేని హంగామాలు ఎందుకు అనే అభిప్రాయాలు సినీ ప్రియుల్లో వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 2, 2023 11:35 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…