Movie News

కృష్ణ అభిమానుల కడుపు నిండిపోయింది


ఏడాది కాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్‌ల హంగామా నడుస్తోంది. ఐతే పోకిరి, జల్సా లాంటి సినిమాలను మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే ఎంజాయ్ చేశారు కానీ.. రీ రిలీజ్‌ల్లో కూడా రికార్డుల గొడవలు మొదలవడంతో ఇదొక ప్రహసనం లాగా తయారైంది ఒక దశ తర్వాత. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.. ఎన్ని షోలు వేస్తున్నారు.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. వసూళ్లు ఎన్ని వచ్చాయి.. థియేటర్లలో సంబరాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాల్లో కూడా లెక్కలేసుకోవడం మొదలై ఈ రీ రిలీజ్‌ల వ్యవహారమే పక్కదారి పడుతున్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి టైంలో ఒక క్లాసిక్ మూవీ ఈ గొడవలేమీ లేకుండా అభిమానులకు మరపురాని అనుభూతిని ఇస్తోంది. ఆ చిత్రమే.. మోసగాళ్ళకు మోసగాడు. సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.

ఈ సినిమా స్పెషల్ షోలను కృష్ణ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదిరిపోయే ప్రింట్ రెడీ చేసింది. అలాగే రిలీజ్‌కు మంచి ఏర్పాట్లు చేసింది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఇక దశాబ్దాల నుంచి స్తబ్దుగా ఉన్న కృష్ణ అభిమానులు.. ఈ తరం ఫ్యాన్స్ లాగా అనవసర హంగామా చేయకుండా ఈ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌ను మళ్లీ థియేటర్లలో చూసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. థియేటర్లలో గోల.. వసూళ్ల గొడవ.. ఇవేమీ లేకుండా సైలెంటుగా సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇప్పటికీ ట్రెండీగా అనిపించేలా సినిమా ఉండటం.. ప్రింట్ అదిరిపోవడం.. కృష్ణను ఎన్నో ఏళ్ల తర్వాత వెండి తెరపై చూడటం వారికి మరపురాని అనుభూతిని ఇస్తోంది. రీ రిలీజ్ అంటే ఇలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా ఉండాలే తప్ప.. రికార్డుల గొడవలు.. అవసరం లేని హంగామాలు ఎందుకు అనే అభిప్రాయాలు సినీ ప్రియుల్లో వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 2, 2023 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

12 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

19 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

46 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago