సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పేరు అవకాశాలు తీసుకురాకపోయినా కీర్తి సురేష్ కు ఆ లోటుని దసరా పూర్తిగా తీర్చేసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న వెన్నెల క్యారెక్టర్ దక్కడంతో మహానటి తర్వాత మరోసారి తన బెస్ట్ ఇచ్చేసింది. అయితే శ్రీలీల జోరులో తనకు ఆఫర్లు తగ్గాయని అభిమానులు ఫీలవుతున్నారు కానీ నిజానికి కీర్తి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలతో ఈ ఏడాది సందడి చేయబోతోంది. అందులో మొదటిది చిరంజీవి భోళా శంకర్. చెల్లెలి పాత్రే అయినా మెగాస్టార్ కాంబినేషన్ కాబట్టి మంచి మెమరీ అవుతుంది.
ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామన్నన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకుడు. తెలుగు డబ్బింగ్ డీల్ పూర్తి కాకపోవడంతో టైటిల్ గట్రా వ్యవహారాలు ఇంకా మొదలుకాలేదు. వడివేలు ఇందులో సీరియస్ పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. జయం రవితో చేస్తున్న సైరన్ మీదా భారీ అంచనాలున్నాయి. టైటిల్ రోల్ పోషిస్తున్న రివాల్వర్ రీటా ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతోంది. కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ రఘు తాత సైతం డిఫరెంట్ సబ్జెక్టే. ఇవన్నీ 2023లోనే వచ్చేస్తాయి.
ఆకాశం నీ హద్దురా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుధా కొంగర తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్. సూర్యతో ఉంటుందా లేక మరొకరు చేస్తారానేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఇలా మొత్తం అరడజను సినిమాలతో అమ్మడు మాములు బిజీగా లేదు. కాకపోతే రెగ్యులర్ గ్లామర్ పాత్రలు ఎక్కువ చేయను అంటోంది. ఈ మధ్య ఫోటో షూట్స్ లో కాస్త మొహమాటం పక్కనపెడుతున్న కీర్తికి మళ్ళీ మహానటి రేంజ్ బ్రేక్ ఏ చిత్రం ఇస్తుందో చూడాలి. పైన చెప్పినవాటిలో కనీసం సగం హిట్టయినా కోలీవుడ్ నెంబర్ వన్ చైర్ ని అందుకోవచ్చు.
This post was last modified on June 2, 2023 11:31 am
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…